నమస్తే తెలంగాణను ప్రతీ ఒక్కరు చదవాలి.. అని ఎమ్మెల్సీ కవిత మీటింగులలో మరీ ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పత్రిక సర్క్యూలేషన్ గురించి ఈ మధ్య సీఎం కేసీఆరే దృష్టి పెట్టారు. ఆదివారం జరిగిన సికింద్రాబాద్ బోనాల ఉత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కానీ ఆ ఫోటో… వార్త నమస్తే తెలంగాణలో ఎక్కడా కనిపించలేదు. పత్రికలోని అన్ని పేపర్లూ తిరగేశారు. ఏ మూలకన్నా వేసుంటారేమోనని. ఉహూ.. ఎక్కడా కనిపించలే. పోనీ హైదరాబాద్ ఎడిషన్కే పరిమితం చేశారేమోనని అందులోనూ వెతికారు. ఏ మూలా చిన్న ఫోటో కూడా కానరాలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ వార్త గుప్పుమన్నది. నమస్తే తెలంగాణలో మన అక్క ఫోటో రాలేదా… ఎందుకు..? ఇంత నిర్లక్ష్యమా..? దీనికి ఎవరూ బాధ్యలు..? అంటూ మండిపడుతున్నారు జాగృతి, పార్టీ శ్రేణులు. మరోపక్క హైదరాబాద్ జర్నలిస్టు సర్కిళ్లలో కూడా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
మన నమస్తే తెలంగాణలో అక్క ఫోటో రాలేదేందీ…? సికింద్రాబాద్ బోనాలకు హాజరైన కవిత ఫోటోను ప్రచురించని నమస్తే… బీఆరెస్ శ్రేణుల్లో, జర్నలిస్టు వర్గాల్లో ఇప్పుడిదే చర్చ….
ByDandugula Srinivas
Jul 10, 2023 #bharath jagruthy, #bonaalu, #brs, #cm kcr, #editor, #MLC Kalvakuntla kavitha, #namasthe telanganaRelated Post
ఫ్రీ బస్ జర్నీ.. కాంగ్రెస్ కు ఘోరి.. ? మహిళల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తున్న ఉచిత ప్రయాణం ! చాలీ చాలని బస్సుల తో అవస్థలు… !! ఆపకుండ ఆడోళ్ళ ఆత్మగౌరవం తో ఆడుకుంటున్న ఆర్టీసీ …. బస్సు ప్రయాణం అంటేనే ఆడోళ్లకు ముచ్చెమటలు.. బెడిసికొడుతున్న పథకం.. ఎన్ని గొప్పలు చెప్పుకున్నా… లోపాలు సరిచేయని సర్కార్…. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పై మహిళా వోటింగ్ ప్రభావం…. ‘వాస్తవo’ exclusive story
Apr 29, 2024
Dandugula Srinivas