Category: State News

ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్‌…! అస‌ల‌క్క‌డ ఏం జరుగుతోంది..? పాలకులు మారినా విధానాలు మారవా..? పేరుకే ప్రభుత్వరంగం… కార్మికులకు తప్పని వెట్టిచాకిరి… ప్రాణంతోడే పనిభారాలు…! సగానికి పైగా అద్దెబస్సులు… ఎలక్ట్రిక్ బస్సులే…! కనీసవేతనాలు కరువు…! కార్మికులు దాచుకున్న సొమ్ము యాజమాన్యం మింగేసిన వైనం..! దుర్భర పరిస్థితుల్లో ఆర్టీసి కార్మికుల జీవితాలు…!!

తెలంగాణ ఏర్పాటు నుండి నేటి వరకు సుమారు 14, 000 మంది ఆర్టీసి కార్మికులు రిటైర్ అయినా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క కొత్త ఉద్యోగం ఇయ్యలేదు సరికదా ఉన్న ఉద్యోగులపైన విపరీతమైన పనిభారం పెంచి వారి ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నది…

నూతన ఆర్‌వోఆర్‌ చట్టం – 2024 ను స్వాగతిస్తున్నాం : ట్రెసా ఇదే స్పూర్తితో గ్రామ రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయాలి…!

వాస్త‌వం ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన ఆర్వోఆర్ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ , సీసీఎల్ఏ క‌మిష‌న‌ర్‌ నవీన్…

భూమిలేని నిరుపేద‌ల‌కు 12వేలు..! రాష్ట్ర వ్యాప్తంగా 40 ల‌క్ష‌ల మందికి మేలు… ఏడాదికి రూ. 4800 కోట్ల భారం..!! ఇవాళ్టి అసెంబ్లీలో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించే అవ‌కాశం… ఈనెల 28 నుంచి అమ‌లు.. అదే రోజు నిరేపేద‌ల‌కు ఆరు వేల చొప్పున న‌గ‌దు జ‌మ‌..!! అర్హుల ఎంపిక విధివిధానాల‌పై అసెంబ్లీలో క్లారిటీ…. అర్హులంద‌రికీ ఇవ్వాల‌నే డిమాండ్‌….

(దండుగుల శ్రీ‌నివాస్ ) ఆరు గ్యారెంటీల ప‌థ‌కంలోంచి మారో హామీ అముల‌కు సిద్ద‌మ‌య్యింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ‌దినోత్స‌వం ఈనెల 28న‌. ఈ రోజు నుంచే భూమిలేని నిరుపేద‌ల‌కు నెల వెయ్యి చొప్పున ఏడాదికి 12వేలు ఇచ్చేందుకు స‌ర్కార్ సిద్ద‌మ‌య్యింది. ఈ మేర‌కు…

టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం.. ! రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్‌ ఆమోదం !!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు ప్రతిపాదనలు పంపింది. వీటిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదించారు. త్వ‌ర‌లో…

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యోగ సంఘాలు నిర్వీర్యమయ్యాయి.. ! మమ్మల్ని టార్గెట్‌ చేస్తే మేము మిమ్మల్ని టార్గెట్‌ చేస్తాం !! టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు…

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఉద్యోగులపై దాడులు చేయడం, దుషణలు చేయడం, బెదిరింపులకు పాల్పడడాన్ని ఏమాత్రం సహించేంది లేదని, ఉద్యోగులను టార్గెట్‌ చేసేవారిని తాము కూడా టార్గెట్‌ చేస్తామని టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. . శనివారం టీజీఓ భవన్‌లో…

సిరిసిల్ల కలెక్టర్‌కు కేటీఆర్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి…! లేక‌పోతే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాం…!! తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి డిమాండ్‌…

వాస్త‌వం ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: సిరిసిల్ల కలెక్టర్‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తక్షణమే బేష‌ర‌తుగా క్షమాపణ చెప్పాలని, లేక‌పోతే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పకుంటే…

న‌మ‌స్తే తెలంగాణ సిటీబ్యూరో ఇన్చార్జికి హైడ్రా నోటీసులు… ! పార్కు స్థ‌లాన్ని క‌బ్జా చేసి.. కోట్ల విలువజేసే ఇల్లు క‌ట్టి…! హైడ్రాకు ఫిర్యాదు చేసిన కాల‌నీ వాసులు…! నోటీసులిచ్చిన హైడ్రా క‌మిష‌న‌ర్‌… ! త్వ‌ర‌లో క‌బ్జా స్థ‌లంలో క‌ట్టిన ఇల్లు కూల్చివేత…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) గుండాల క్రిష్ణ‌. న‌మ‌స్తే తెలంగాణ సిటీబ్యూరో ఇన్చార్జి. ఆ ప‌త్రిక‌కు షాడో ఎడిట‌ర్‌. ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తికి రైట్ హ్యాండ్‌. ఆ ప‌త్రిక‌లో ఇత‌డు చెప్పిందే వేదం. క్రిష్ణ ఎట్ల చెబితే అట్ల తోకాడిస్తాడు ఎడిట‌ర్‌. హైడ్రా ఏర్పాటు త‌రువాత…

రైత‌న్న చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన రోజు…! ఏడాదిలో 54వేల కోట్ల‌తో పండుగ తెచ్చాం..!!

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఇవాల్టి దినాన్ని యాది చేసుకున్న‌డు సీఎం రేవంత్‌రె్డి. స‌రిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మార్పు కోసం ఓటేసిన రైత‌న్నఅనుకున్న‌ది సాధించాడు. ఆ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా రైత‌న్న చ‌రిత్ర‌ను ప్ర‌జా పాల‌న స‌ర్కార్ చ‌రిత్ర‌ను…

పెట్టుబ‌డి సాయంపై అసంతృప్తి…! బోన‌స్ సాయంపై రైతు ఖుషీ…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రైతు భ‌రోసా ఇంకా ఇవ్వ‌లేద‌నే అసంతృప్తి రైతుల్లో ఉంది. ఇవ్వాళ, రేపు, ద‌స‌రాకు, దీపావ‌ళి… ఇలా ఇప్పుడు సంక్రాంతి వ‌ర‌కు వ‌చ్చింది విష‌యం. సంక్రాంతి లోపు విధివిధానాల‌పై ఓ క్లారిటీ రాగానే రైతు భ‌రోసా ఇస్తామ‌ని వ్య‌వ‌సాయ శాఖ…

లగిచర్ల ఘటన మరువకముందే దిలావర్పూర్ ఘటన బాధాకరం ..! మహిళా ఆర్ డి ఓ నిర్బంధించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి ! రెవిన్యూ ఉద్యోగులపై ఈ రకమైన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం !! ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌-గుండంపల్లి గ్రామాల మధ్య చేపట్టిన ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా మంగళవారం రెండు గ్రామాల వారు 61వ జాతీయ రహదారిపై బైఠాయించటం తో జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో, నిరసనకారులతో మాట్లాడేందుకు దిలావర్‌పూర్‌కు వచ్చిన…