రెండు వేల రూపాయల నోటు చూసి ఎన్ని రోజులైందో..? అవి ఎక్కడికక్కడ ప్యాక్ చేసేశారు. బ్యాంకుల్లో కూడా కనిపించడం లేదు. ఏటీఎంలో దర్శనమివ్వక నెలలు, సంవత్సరాలే గడుస్తున్నాయి. దీంతో కొంత కాలం క్రితం నుంచే జనాల్లో అనుమానం మొదలైంది. ఈ రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేస్తుందేమోనని. వాస్తవానికి ఈ నోటును తీసుకొచ్చినప్పుడే చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. రెండు వేల పెద్ద నోటుతో మరింతగా మనీ బ్లాక్ అయ్యే అవకాశం ఉందని, అక్రమార్కులు వీటిని ఎక్కడికక్కడ ప్యాక్ చేసే ప్రమాదం ఉందని భావించారు. ఈ నోట్లు ఎక్కువ రోజులు చెలామణిలో ఉండబోవని కూడా ముందే ఊహించారు. ఊహించినట్టే అవి కొద్ది రోజుల్లోనే మార్కెట్లో కనిపించకుండా పోయాయి. తాజాగా ఆర్బీఐ ఓ నివేదిక విడుదల చేసింది. మళ్లీ పెద్ద నోట్ల రద్దు జరగవచ్చనే విధంగా ఆ నివేదిక సూచనలు ఇస్తోంది. ఇప్పుడిదే చర్చకు తెరతీసింది. 500 నోట్లు, 2వేల నోట్లు నకిలీ పెరిగావని, 500 ఫేక్ నోట్లు 101 శాతం, 2వేల ఫేక్ నోట్లు 54 శాతం పెరిగావని తెలిపింది. 50, 100 నోట్లు తప్ప ఈ రెండు పెద్ద నోట్లు ఫేక్వి పెరిగావని పేర్కొన్నది. దీంతో త్వరలోనే మళ్లీ పెద్ద నోట్ల రద్దుకు ముహూర్తం ఖారయ్యిందా..? అనే చర్చలు సాగుతున్నాయి.
మళ్లీ నోట్ల రద్దు ఉంటుందా..? 2వేలు, 5 వందల నోట్లు ఫేక్వి పెరిగావట… ఆర్బీఐ నివేదిక దీనికే సంకేతామా.?.
Related Post
సెప్టెంబర్ 17 ప్రాధాన్యమేమిటి? బీజేపీ తప్పుదారి పట్టిస్తోందా..? అసలు చరిత్ర ఏం చెబుతోంది..?? తమ భిన్నత్వాన్ని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేత ఆమోదింప చేయాలనే ఎత్తుగడ మాత్రమే. ఎప్పుడైతే 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడిందో తెలంగాణ సమాజానికి తమ అస్తిత్వాన్ని చాటుకునే, సంబరాన్ని జరుపుకునే ఒక సందర్భం వచ్చింది. జూన్ రెండుకున్న ప్రాధాన్యం ముందు మరేదీ నిలువలేదు.
Sep 16, 2023
Dandugula Srinivas
పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..? మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము బహిష్కరించాలి. ఈ విషయంలో బీఆరెస్ వ్యూహం ఏమిటీ…? సర్వత్రా ఆసక్తికరంగా మారిన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం….
May 25, 2023
Dandugula Srinivas