Month: December 2023

ఐదో తారీఖే ఇక జీతాలు… కొత్త ఏడాది నుంచి ఉద్యోగులకు టంచన్‌గా జీతాలిచ్చేందుకు సర్కార్‌ యోచన.. ఈ-కుబేర్‌ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న రేవంత్‌ సర్కార్‌.. నిధులున్న శాఖల నుంచి అడ్వాన్సులు తీసుకోవడం.. అవసరమైతే ఒక నెల జీతాల కోసం అప్పులు తెచ్చైనా సరే… గతంలో లాగా రొటేషన్‌ సిస్టం వద్దంటున్న ఉద్యోగులు… రుణాలు తీసుకోకుండా చేసిన సకాలంలోరాని జీతాలు.. ఇకనైనా తమ జీ(వి)తాలు మారుతాయా.. ? అని ఎదురుచూస్తున్న ఉద్యోగులు..

కేసీఆర్‌ సర్కార్‌లో ఉద్యోగులు సకాలంలో జీతాలు తీసుకున్నది లేదు. అలవాటైపోయిందలా. ఇగో ఇప్పటికీ రాలే వారికి జీతాలు. ప్రతీనెల టంచన్‌గా చెల్లించే ఈఎంఐలు, పాలు, రెంట్‌, ఆటో, స్కూల్‌ రెంట్లకు నానా తంటాలు పడే దురస్థకు అలవాటు పడిపోయారు ఉద్యోగులు. గత…

ఆరుగురుని మట్టుబెట్టిన సీరియల్‌ కిల్లర్‌.. నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. పదిహేను రోజుల్లో ప్రాణ స్నేహితుడు, అతని కుటుంబీకులను హత్య చేసిన నరరూప రాక్షసుడు.. స్నేహితుడి ఇంటి కోసం.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మాక్లూర్‌కు చెందిన సైకో కిల్లర్‌ గొల్ల ప్రశాంత్‌.. ప్రసాద్‌తో పాటు అతని భార్య, ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు చెల్లెండ్లను మట్టుబెట్టిన ప్రశాంత్‌.. చెల్లెండ్లను తగులబెట్టి… పసి పిల్లలను, భార్యను గొంతు నులిమి వాగులో వేసి.. స్నేహితుడిని చంపి బొందపెట్టి.. ఆరు రోజుల్లోనే చాకచక్యంగా కేసును చేధించిన పోలీసలు.. సైకో కిల్లర్‌ ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురు పోలీసులు అదుపులో.. ఓ పార్టీ లీడర్‌తో సత్సంబంధాలు.. వారితో దిగిన ఫోటోలు చూపి అరాచకాలు… మృతుడు ప్రసాద్‌కూ నేర చరిత్ర..(వాస్తవం- ఎక్స్‌క్లూజివ్‌)

(వాస్తవం- ఎక్స్‌క్లూజివ్‌) దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: నిండా ముప్పై ఏండ్లు లేవు వాడికి. ఓ పదిహేను, ఇరవై లక్షల ఇంటి ఆస్తి కోసం ..తన ప్రాణ స్నేహితుడిని, అతని కుటుంబ సభ్యులను పదిహేను రోజుల్లోనే ఆరుగురిని మట్టుబెట్టాడు సైకో సీరియల్‌…

దళితబంధు కొంపముంచింది… బీజేపీ మేయర్‌ సీటుపై కన్నేసింది.. ఇక బీఆరెస్‌లో ఉండలేమంటున్న బీఆరెస్‌ కార్పొరేటర్లు.. బీజేపీలోకి నలుగురు కార్పొరేటర్లు జంప్‌.. ఇంకా లైన్లో మరికొంత మంది.. నష్టనివారణకు దిగిన కవిత, బిగాల… ఉన్నవారిని కాపాడుకునే ప్రయత్నాలు .. ఇప్పటికైతే సఫలం.. రేపటికేమౌనో..?

దళితబంధు అర్బన్‌ ఎమ్మెల్యేగా ఉన్న బిగాల గణేశ్‌గుప్తా కొంపముంచింది. ఎడాపెడా ఇష్టమొచ్చినట్టు అందరికీ హామీలిచ్చేశాడు. నీకిన్ని నీకిన్ని అంటూ వాటాలు పంచేశాడు. వారంతా జనాల వద్ద కమీషన్లు నొక్కేశారు. తీరా చూస్తే ఎన్నికలొచ్చాయి. బీఆరెస్‌ ను తిరస్కరించారు ప్రజలు. దళితబందు లేదు..…

ఇందూరులో పడగెత్తిన పొలిటికల్‌ ఫ్యాక్షనిజం.. ‘మాజీ’లపై ‘తాజా’ల దండయాత్ర.. పదేళ్ల పగ.. కట్టలుతెంచుకున్న ప్రతీకారం.. బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యేలపై అధికార, బీజేపీ పార్టీల దాడులు

దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి: ఇందూరులో ఫ్యాక్షన్‌ రాజకీయాలు పడగలెత్తాయి. మొన్న మొన్న ఎన్నికలు ముగిశాయో లేదో కానీ.. అప్పుడే పగ కట్టలు తెంచుకుంటున్నది. ఫ్యాక్షన్‌ రాజకీయాలు పడగవిప్పుతున్నాయి. ఆర్మూర్‌, బోధన్‌ మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్‌లు టార్గెట్‌గా ప్రతీకార…

ప్రియమైన శత్రువు… ప్రాణమిత్రులు.. బద్దశత్రువులు.. షకీల్‌ను టార్గెట్‌ చేసిన శరత్‌రెడ్డి.. షకీల్‌ రైస్‌మిల్లుల అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు.. అధికారులతో దాడులు.. రైస్‌మిల్లుల వ్యాపారంలోకి తీసుకొచ్చింది శరత్‌రెడ్డే.. ఇప్పుడు అదే వ్యాపారంలో షకీల్‌ను ఇరికించిన వైనం..

ఇద్దరు ఒకప్పుడు ప్రాణమిత్రులు.. ఒకరి విడిచి మరొకరు ఉండలేని సన్నిహిత స్నేహం. రాజకీయాలకంటే తనకు స్నేహమే ముఖ్యమనుకున్నాడు శరత్‌రెడ్డి. రాజకీయంగా ఓ స్థాయికి తెచ్చాడు షకీల్‌. అప్పటి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే శరత్‌రెడ్డి సతీమణిని బోధన్‌ మున్సిపల్‌గా షకీల్‌ చేశాడో..…

ఇందూరు బీఆరెస్‌ అనాథ.. ఒకప్పుడు కంచుకోట.. ఇప్పుడు దిక్కులేని అనాథ.. గ్రూపు రాజకీయాలతో, పట్టులేని తనంతో కకావికలమైన పార్టీ పరిస్థితి.. కవితే పెద్ద దిక్కుగా భావిస్తున్న క్యాడర్‌.. నిజామాబాద్‌ ఎంపీగా బరిలో ఉండాలనే ఆకాంక్ష… జిల్లా పార్టీ అధ్యక్షుడిని మార్చి పార్టీకి పూర్వవైభవం తేవాలనే కోరిక… ఇందూరు జిల్లాలో తలోదిక్కుగా మారిన పార్టీ… కవితే ఇప్పుడు ఇందూరు ఇంటికి పెద్ద దిక్కని భావిస్తున్న నాయకులు, కార్యకర్తలు..

( దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి: ) కాలం మారింది. మార్పు కాటేసింది. ఒకప్పుడు పరపతి. ఇప్పుడు అథోగతి. మొన్నటి దాకా మాటే శాసనం. ఇప్పుడు ముఖమే బంగారం. ఎవరూ పత్తాకు లేరు. పార్టీ అంతా కకావిలకం. అసెంబ్లీ ఎన్నికల ఫలితం…

ఈరవత్రికి ఎమ్మెల్సీ…. అధిష్టానం సంకేతం.. విధేయతకు అనిల్‌కు ఇచ్చే గిఫ్ట్‌….

దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి: ఈరవత్రి అనిల్‌. బీసీ నేత. జిల్లాలో ఎక్కువ సామాజికవర్గం ఉన్న పద్మశాలి వర్గానికి చెందినవాడు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. ఆ తరువాత అంతా రాజకీయ శూన్యత…

షాడో ఎమ్మెల్యేలు.. ఆర్మూర్‌, అర్బన్‌కు అర్వింద్‌.. బోధన్‌లో శరత్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌లో మండవ వెంకటేశ్వరరావు.. పేరుకు ఎమ్మెల్యేలే కానీ.. పెత్తనం వీరిదే.. ఇందూరు రాజకీయాల్లో ఇదో వింత పరిస్థితి..

(దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి) ఇందూరు ఓటరు విలక్షణ తీర్పునిచ్చాడు. నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కటి మాత్రమే బీఆరెస్‌కు ఇచ్చి మిగిలినవి చెరో రెండు పంచుకున్నాయి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు. బాల్కొండ మాత్రం బీఆరెస్‌కు అత్తెసరు మెజారిటీతో గెలిపించింది. ఆర్మూర్‌లో…

ఆలస్యమైనా అంకుల్‌కు కీలక పదవి.. సుదర్శన్‌రెడ్డికి హోం శాఖ… రేవంత్‌ మదిలో ఫిక్స్ అయిన పోర్ట్‌ ఫోలియో… జిల్లా నుంచి ఇద్దరికి కీలక పదవులు.. మహేశ్‌కు పీసీసీ చీఫ్‌… సుదర్శన్‌రెడ్డికి హోం… జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతానికి రేవంత్ కీలక మంత్రం..

జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతమవుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాపై ప్రత్యేక నజర్‌ పెట్టాడు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు త్వరలో పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. ఇది జిల్లాకు పెద్ద బలం. కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలం. డీఎస్ తర్వత…

జీవన్‌రెడ్డిపై సీబీఐ ఎంక్వైరీ.. సిఫారసు చేసిన రాకేశ్‌రెడ్డి.. కేజీఎఫ్ సినిమాలో బంగారు గనులు తవ్వినట్టుగా మాక్లూర్‌ గుట్టలు, మొరం మాయం చేశారు… దీనిపై సర్వే జరగుతున్నది.. నన్ను చంపాలని బెదిరింపులు వస్తున్నాయి.. భయపడను.. -సీపీకి ఫిర్యాదు చేసిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.. ఢిల్లీ నుంచి బండి సంజయ్ ఫోన్‌.. రాకేశ్‌కు మద్దతు.. భయపడేది లేదు ముందుకు వెళ్లమని భరోసా… రాకేశ్‌కు సెక్యూరిటీ పెంపు..

రాష్ట్రం అంతా ఒక్కటి నడిస్తే ఆర్మూర్‌లో మరొకటి నడుస్తోంది. మొన్నటి వరకు అక్కడ జీవన్‌ రెడ్డి మోనార్క్‌. మోనోపాలి. అక్క, అన్న పేరు చెప్పి అందరినీ భయపెట్టి అన్ని కార్యక్రమాలు చేసుకున్నాడు. మధ్యలో పెద్దవాళ్ల పేర్లూ బద్నాం చేశాడు. ఇప్పుడు సీన్‌…

You missed