వాస్తవం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైదరాబాద్‌:

 

ఆమె ఒక అనామ‌కురాలు. ఒకే ఒక బ్రాండ్ ఆమెకు. ఇంద్రారెడ్డి స‌తీమ‌ణిగా. అంతే. ఆయ‌న ప‌ర‌మ‌ప‌దించిన త‌రువాత‌… వైఎస్సార్ ద‌గ్గ‌ర తీసుకున్నాడు. ఎంత‌లా అంటే సొంత చెల్లెలా. అంత‌కు మించి కూడా. చేవెళ్ల చెల్లెమ్మ అని ముద్దుగా ఆమెను వేదిక‌ల మీద పిలుచుకునేవారాయ‌న‌. పిలిచి టికెట్ ఇచ్చి.. ఎమ్మెల్యేగా గెలిపించుకుని.. మంత్రిని చేసి.. హోం మంత్రి ఫోర్ట్ ఫోలియో ఇచ్చి.. త‌న స‌ర్కార్‌లో అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి…… ఇలా ఎంతో ఎంతో చేశారు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ప్రాణ‌హిత‌- చేవెళ్ల ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌న‌లో, డిజైన్‌ల‌లో ఆమె స్వ‌యంగా వైఎస్సార్ వెంట ఉన్న‌ది.

ఈ కీల‌క, చారిత్ర‌క ఘ‌ట్టంలో ఆమె పాలుపంచుకున్న‌ది. తెలంగాణ‌కు వ‌ర‌ప్ర‌దాయని అయిన ప్రాణ‌హిత‌- చేవెళ్ల ప్రాజెక్టును వైఎస్సార్ త‌న మాన‌స పుత్రిక‌గా భావించారు. తెలంగాణ‌కు దీని వ‌ల్ల మేలు జ‌ర‌గుతుంద‌ని ప్ర‌గాఢంగా విశ్వ‌సించారు. జ‌ల‌య‌జ్జంయ‌పేరుతో ఆయ‌న తెలంగాణ‌ను శ‌స్య‌శ్యామ‌లం చేయాల‌నుకున్నారు. తెలంగాణ‌లోని ప‌ది జిల్లాల‌కు స‌రిప‌డా, క‌డుపు నిండా సాగునీరందించే బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక అది.

 

కానీ కాలం మారింది. స‌బితమ్మ పార్టీ మారింది. చేవెళ్ల చెల్లెమ్మ‌… కేసీఆర్ బానిసైంది. అధికారం కోసం. అన్న రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పెట్టిన రాజ‌కీయ భిక్ష‌ను మ‌రిచింది. చేవెళ్ల చెల్ల‌మ్మ అని పిలుచుకున్న ముద్దు పేరును తుడిచేసుకున్న‌ది. రంగారెడ్డి జిల్లా సాగునీటి వ‌న‌రుల‌ను కాల‌రాసే విధంగా ఉన్న కాళేశ్వ‌రం డిజైన్‌కు ద‌గ్గ‌రుండి మ‌రీ ఆమోద ముద్ర వేసింది. ఎందుకు? అధికారం కోసం. కేసీఆర్ మెప్పు కోసం. త‌న రాజ‌కీయ అస్థిత్వం కోసం. ప‌ద‌వుల కోసం. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా ప్రాణ‌హిత‌- చేవెళ్ల అలైన్‌మెంటే మారింద‌ని ఆమెకు తెలుసు. ఆ నీళ్లు… రంగారెడ్డి జిల్లాన త‌డ‌ప‌డం లేద‌నీ తెలుసు. చేవెళ్ల‌ను చుక్క‌నీరు రావ‌నీ తెలుసు. కానీ .. కానీ ఆమె ఎందుక ఒప్పుకున్న‌ట్టు.

కేసీఆర్‌ను ఎదురించే ధైర్యం లేదు. అధికారం కావాలి. ప‌ద‌వులు కావాలె. అంతే. త‌న‌కు ఇప్పుడు ప‌ద‌వులు.. త‌రువాత కొడుకుకు ప‌ద‌వులు… ఇదే ఆమె ఆలోచ‌న‌. చెవెళ్ల ఎటు పోతే ఏందీ.. రంగారెడ్డి గంగ‌లో క‌లిస్తే ఎందీ..? అక్క‌డికి గంగ త‌డి రాకుంటే ఏందీ..? ఇదే వైఖ‌రి కొన‌సాగింది స‌బిత‌మ్మ‌లో. అందుకే ఇప్పుడు రెంటీకి చెడ్డ రేవ‌డిలా మిగిలింది. అధికారం కోల్పోయి.. పుట్టిన గ‌డ్డ‌కు అన్యాయం చేసి… మున్ముందు త‌న పాపం పిల్ల‌ల‌కూ త‌గిలేలా ప్ర‌వ‌ర్తించి.. మాన‌సిక క్షోభ అనుభ‌విస్తున్న‌ది చేవెళ్ల చెల్లెమ్మ. మ‌న స‌బిత‌మ్మ‌.