నిద్రాహారాలు మాని.. ప్ర‌జాక్షేమాన్ని కాంక్షించి… లోత‌ట్టు ప్రాంతాల ప‌రిశీల‌న‌… గూడు చెదిరిన జ‌నానికి బాస‌ట‌…

అధిక వర్షాల నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఉండి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి 1 వరకు ఆయన జిల్లా ఆయా శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు 24 గంటలు జిల్లా కేంద్రంలోనే…

ఎస్సారెస్పీపై ముఖ్య‌మంత్రి కేసిఆర్ ఆరా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై సీఎంకు వివ‌రించిన మంత్రి వేముల‌

ముఖ్యమంత్రి కేసిఆర్ కు ప్రస్తుత పరిస్థితుల పై మంత్రి వేముల ఫోన్లో వివరించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ కి 4.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. 36 గేట్లు ఎత్తి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన మహారాష్ట్ర…

అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దు…ప్రయాణాలు రద్దు చేసుకోవాలి ..త‌హ‌సీల్దార్లు గ్రామ‌స్థాయిలో అందుబాటులో ఉండాలి.

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు…. అధిక వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో సమీక్షించారు. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే…

జాతీయ చిహ్నాల రూపురేఖలు మారిస్తేనో, నగరాల పేర్లు మారిస్తేనో దేశం మారదు, దేశ భవిష్యత్తు అంతకన్నా మారదు…

ఒకప్పుడు పటాల్లో ప్రశాంతంగా కనపడే రాముడు, ఆంజనేయుడు, శివాజీ లాంటి బొమ్మలు ఈ పువ్వుల పాలన వచ్చాక ముఖాల్లో ఆగ్రహం ప్రదర్శిస్తున్నాయి…. సరే అవన్నీ బత్తాయి సోషల్ వింగ్ ఎడిట్ చేసి నిత్యం ఫేక్ వార్తల్లో భాగంగా వాటినీ మార్చేసారు అనుకుందాము……

మెడిక‌ల్ మాఫియాకు ఇదో కోలుకోల‌ని దెబ్బ‌…. క‌రోనా ఇక సీజ‌నల్ వ్యాధుల లిస్టులో…. టైఫాయిడ్‌, డెంగీ కేసులే ప్రైవేటు ఆస్ప‌త్రుల‌ను కాపాడాలి.

క‌రోనా ప్రైవేటు ఆస్ప‌త్రుల యాజమాన్యాల‌ను, డాక్ట‌ర్ల‌ను, మెడిక‌ల్ షాపుల ఓన‌ర్ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేశాయి. జ‌నం ప్రాణాల‌తో చెల‌గాట‌మాడిన క‌రోనా ఈ సెక్ష‌న్ల‌కు మాత్రం వ‌రంగా మారింది. దీంతో పుట్ట‌గొడుగుల్లా కొత్త ఆస్ప‌త్ర‌లూ పుట్టుకొచ్చాయి. ఆ త‌ర్వాత క‌రోనా తీవ్ర‌త త‌గ్గుతూ వ‌చ్చింది.…

ఈసారి ప‌క్కా… క‌చ్చితంగా వ‌చ్చే నెల నుంచే కొత్త పింఛ‌న్లు.. అరే న‌మ్మండ్రా బాబు… రామ‌న్న చెప్పినా న‌మ్మ‌రా..? డౌటేనంటారా..??

కొత్త పింఛ‌న్ల జోలికి పోకి మూడేండ్లు దాటింది. ఉన్న పింఛ‌న్లే నెల‌నెలా స‌రిగా ఇవ్వ‌టం లేదు. ప్ర‌తినెలా చ‌నిపోయిన వారిని తొల‌గిస్తూ పోతున్నారు త‌ప్ప కొత్త వారికి మాత్రం పింఛ‌న్లు ఇవ్వ‌డం లేదు. ఏండ్ల త‌ర‌బ‌డి వేచి చూసి చాలా మంది…

మ‌నోళ్ల‌కు సినిమా చైత‌న్యం పెరిగింది బాసూ…. ప‌చ్చి మ‌క్క‌బుట్ట‌పై కూడా సెటైర్లు… ఏమ‌రుపాటుగా ఉంటే ద‌ర్శ‌కుడితో ఇలా ఆడుకుంటారు…

ప్రేక్ష‌కుడి సినీ నాలెడ్జ్ విప‌రీతంగా పెరిగింది. సునిశిత దృష్టితో ప్ర‌తీ కోణాన్ని స్పృశిస్తున్నారు. పాట‌లు, సంగీతాలు, సీన్లు, ఫైట్లు.. ఇలా ఏవైనా కాపీ కొట్టారో వాళ్ల బండారం క్ష‌ణాల్లో బ‌య‌ట‌పెడుతున్నారు సోష‌ల్ మీడియాలో.తాజాగా ది వారియ‌ర్ సినిమా పోస్ట‌ర్‌పై సెటైర్లు వేస్తున్నారు.…

ర‌జాకార్ల‌పై సినిమా తీస్తావా..? బిడ్డా! నువ్వు గనుక తెలంగాణలో చిచ్చు పెట్టావంటే మర్యాద దక్కదు! క‌థ‌ల‌ను వ‌క్రీక‌రించ‌డంలో నువ్వు దిట్ట‌… రాజాకార్లంటే కేవ‌లం ముస్లింలేన‌ని వ‌క్రీక‌రించ‌గ‌ల‌వు….

బిడ్డా! నువ్వు గనుక తెలంగాణలో చిచ్చు పెట్టావంటే మర్యాద దక్కదు! •••• BJP మరో విష ప్రయోగం చేయనుందా? తెలంగాణలో రజాకార్ల నేపథ్యంలో సినిమాతో హిందువులు ముస్లింల మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నం జరుగుతుందా? జానపద కథలను వక్రీకరించడంలో ఇతను దిట్ట.…

రెవెన్యూ స‌ద‌స్సుల‌తో ఒరిగేదేమీ లేదు.. స‌ర్కార్‌కు మ‌రింత చెడ్డ పేరు రావ‌డం మిన‌హా… మొత్తం అధికారాలు క‌లెక్ట‌ర్లకే ఇస్తే ఇలాగే ఉంటుంది.. ధ‌ర‌ణిలో అస‌లు స‌మ‌స్య ఇదే…

భూ రికార్డుల న‌మోదు.. సంస్క‌ర‌ణ‌ల్లో ధ‌ర‌ణికి మించింది లేదు.. ఇది స‌ర్వ భూ స‌మ‌స్య‌ల‌కు స‌ర్వ రోగ నివార‌ణి అంటూ ప్ర‌భుత్వం ఎంత ఢంకా బ‌జాయించినా.. క్షేత్ర‌స్థాయిలో ఈ భూ స‌మ‌స్య‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పైగా కొత్త చిక్కుల‌ను తెచ్చిపెడుతున్నాయి.…

బీజేపీ నేతలు ఆమె తల తీసేవరకు ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు… బెదిరింపుల‌కు ఏమాత్రం వెరువని ఈ ధీర ” లీనా మణిమేఖలై ” గురించి మీకు తెలుసా..? కాళీ సినిమా ప్రోమో లో పొగ త్రాగుతున్న కాళికదేవి పోస్టర్ చూశారా.. ??

కొందరంతే.. భయం అనే పదం వీళ్ళ డిక్షనరీలోనే ఉండదు.ఒంటరిగా వెళ్ళి కొండల్ని ఢీకొంటాం అంటారు.ఎన్ని అడ్డంకులు వచ్చినా తగ్గేదే ల్యా అంటారు.ఎన్ని సవాళ్లు ఎదురైనా చేయాలనుకున్న పని చేస్తారు.చెప్పాలనుకున్న విషయం చెప్పి తీరతారు. విమర్శలకు ఏమాత్రం వెరువని ధీర ” లీనా…