రెవెన్యూ ఉద్యోగులను… కేసీఆర్ దొంగలుగా చిత్రీకరించాడు..! రేవంత్ ఆత్మగౌరవాన్ని పెంచాడు…!! రెవెన్యూ ఉద్యోగుల్లో నయా జోష్ పెంచిన సీఎం ప్రసంగం… ప్రభుత్వంలో కీలకభూమిక వీరిదేనన్న రేవంత్రెడ్డి… ప్రభుత్వానికి, పథకాలకు వెన్నుముకలో నిలిచే రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలన్న సీఎం…. ఉద్యోగుల్లో పెరిగిన భరోసా…!
(దండుగుల శ్రీనివాస్) ఇంట్లో ఎలుకలు పడితే ఇళ్లంతా తగులబెట్టిండట వెనుకటికొడు. అలాగే కొనసాగింది కేసీఆర్ వైఖరి ఆనాడు. ఇదే విషయాన్ని ఉటంకించాడు సీఎం రేవంత్రెడ్డి. రెవెన్యూ శాఖలో కొంత మంది అవినీతిపరులున్నారని మొత్తం ఆ శాఖ ఉద్యోగుల్నే దొంగలుగా చిత్రీకరించాడు కేసీఆర్.…
