(దండుగుల శ్రీనివాస్)
కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్పై సర్కార్ తీసుకున్న చర్యలు జనాల్లో మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఏకంగా ఢిల్లీలో బీసీల రిజర్వేషన్ల పోరాటానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నాయకత్వం వహించడం మరింత మైలేజీని తెచ్చిపెట్టింది. ఈ విషయంలో రేవంత్ పై చేయి సాధించాడు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీ బాట పట్టిన సీఎం.. అక్కడ జంతర్మంతర్ వద్ద ధర్నా బీసీ సంఘాల నాయకులతో చేపట్టిన ధర్నా సక్సెసయ్యింది. ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా అటు బీజేపీని, ఇటు బీఆరెస్ను ఇరకాటంలోకి నెట్టేసింది.
పార్లమెంటులో బీసీ బిల్లు పాస్ చేయించేలా ఒత్తిడి తేవడంతో పాటు అది చేయకపోతే బీసీల ముందు బీజేపీ దోషిగా నిలబడుతుందనే సంకేతం ఇచ్చాడు ఢిల్లీ వేదికగా రేవంత్. మరోవైపు ప్రతిపక్షాలను తీసుకుపోలేదు. మైలేజీ మొత్తం కాంగ్రెస్కే వచ్చేలా చేశాడు. ఎలాగూ మోడీ పట్టించుకోడు. బీజేపీకి ఈ విషయంలో చిత్తశుద్ది లేదు. రిజర్వేషన్ల ఆచరణ అంత ఈజీ కాదు. అది సాధ్యం కూడా కాదు. కానీ ప్రజాక్షేత్రంలో బీజేపీ మాత్రం దోషిగా ఉండబోతుంది. ఇదే ఎత్తుగడను ప్రయోగించాడు రేవంత్. అది సక్సెస్ దిశగా ముందుకు సాగుతోంది. మరోవైపు ఇక్కడ బీఆరెస్ కూడా ఇరుకన పడింది.
కవిత బీసీజపంచేస్తున్నా.. బీసీల పట్ల కేసీఆర్కు చిత్తశుద్ది లేదు. ఆయనకు అధికారమే ముఖ్యం. అందుకే మూడు మూడు సార్లు సిట్టింగులకే టికెట్లిచ్చాడు తప్ప సామాజిక న్యాయం పాటించలేదు. ఇప్పడూ అదే చేస్తాడు. రేవంత్ ఈ బీసీ రిజర్వేషన్ రాజకీయంలో పై చేయి సాధిండచంతో పాటు రేపు చట్ట సభల్లో కాకుండా ఏ ఎన్నికల్లోనైనా బీసీలకు 42 శాతం పార్టీ పరంగా టికెట్లిస్తాడు. చచ్చినట్టు బీజేపీ, బీఆరెస్ కూడా ఇచ్చే పరిస్థితి కల్పించాడు. ఈ క్రెడిటంత తన ఖాతాలో వేసుకుని బీసీల మనసు గెలుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్. ఆ దిశగా తను చేస్తున్న ప్రయత్నాలు, వేస్తున్న అడుగులు సఫలీకృతం అవుతున్నాయనే చెప్పాలి.