ఇందూరు గౌడ్స్ను వెంటాడుతున్న మధుయాష్కీ పాపం.. ! రాజకీయంగా ఆదుకుంటే అనాథను చేసిన మాజీ ఎంపీ.. నిజామాబాద్ లోక్సభ పరిధిలో గణనీయంగా గౌడ్స్ ఓట్లు.. మధుయాష్కీని గుండెల్లో పెట్టి గెలిపించుకున్న గౌండ్లు.. అవకాశవాద రాజకీయాలతో ఆ కులస్థుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మధుయాష్కీ.. జిల్లా రాజకీయాలకు దూరమైన యాష్కీ.. ఇప్పుడు ఎంపీ టికెట్ అడగలేని పరిస్థితి..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: మధుయాష్కీ. రాజకీయాలంటే అసలే తెలియదు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చాడు. డీఎస్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. పక్కా సమైక్యవాదియైన రాజశేఖర్రెడ్డిని ఎదిరించి నిలిచాడు. మాచారెడ్డి మండలంలో రైతుల ఆత్మహత్యలపై చలించి…
