తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా నష్టపోయారంటే.. ఎవరికైనా ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటే .. ఆ లిస్టులో మేమే ముందుంటాం.. అని ఘంటాపథంగా చెప్పే వాళ్లలో జర్నలిస్టులున్నారు. అవును.. అంతలా వారికి కేసీఆర్‌ అంటే కోపముంది. హైదరాబాద్‌ లో ఏ ఒక్క జర్నలిస్టును కదిలించినా… కేసీఆర్‌ మీద, కేటీఆర్‌ మీద, ఆ పార్టీ వైఖరిపైనా అగ్గిమీద గుగ్గిలమే అవుతారు. ఇది కాదనలేని సత్యం. కానీ కొన్ని వాస్తవాలు ప్రభుత్వం ఒప్పుకోదు. కేసీఆర్‌ దాకా అవి చేరవు. ఇప్పుడు కొత్తగా కేసీఆర్‌ మళ్లీ జర్నలిస్టుల సంక్షేమం మాటెత్తుకున్నాడు. డిల్లీ వేదికగా. బీఆరెస్‌ పుట్టుక సందర్బంగా. ఇదంతా ఎందుకు ఒక్క ఉదాహరణ చాలు. అధికార పార్టీ పత్రిక నమస్తే తెలంగాణలో కేసీఆర్‌ ఏరికోరి పెట్టుకున్న ఎడిటర్‌ వల్ల వందల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు పాలయ్యారు. అదీ కరోనా సమయంలో. అదెవ్వరూ పట్టించుకోలేదు.వేరే పత్రికలవీ అదే దారి. ఇంచుమించు అధికార పార్టీ చెప్పిందే వేదం. పైగా ఇదో జర్నలిజమా అని మాట్లాడేదీ వాళ్లే. ఇది ఫోర్త్‌ ఎస్టేట్‌ కాదు.. ప్రైవేటు ఎస్టేటనీ సర్టిఫికేట్‌ ఇచ్చేది వాళ్లే…

జర్నలిస్టు నేతలతో…ఇదీ కేసీఆర్‌ మాటామంతి… సంబరాలు చేసుకోవాల్సిన సందర్బమే కదా…

CMO.
తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
మీడియా అకాడెమీ ద్వారా జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటూ వస్తున్నదనన్నారు. అక్రిడేషన్లు సహా జర్నలిస్టులకు అందాల్సిన అన్ని ప్రత్యేక సౌకర్యాలను అందిస్తున్నదని, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందనీ సీఎం కేసిఆర్ అన్నారు.

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు సందర్భంగా అభినందనలు, తమ సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ కి వచ్చిన అల్లం నారాయణ ఇతర జర్నలిస్టు నేతలతో సీఎం కేసిఆర్ రెండోరోజు శుక్రవారం మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సంధర్భంగా జర్నలిస్టు నేతలు పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెల్లారు. పలు జర్నలిస్టు సమస్యలపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసిఆర్,
ఇంకా ఏవైనా సమస్యలుంటే పరిస్థితులను బట్టి చర్చించి పరిష్కరించుకుందామన్నారు.

తెలంగాణ జర్నలిస్టుల సంఘం (టి యు డబ్ల్యు జె) ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐ జే యు) జాతీయ సదస్సు కు ముఖ్య అతిథిగా సీఎం కేసిఆర్ ను ఆహ్వానించగా సీఎం కేసిఆర్ సానుకూలంగా స్పందించారు.

జర్నలిస్టు విషయాలపై సమన్వయం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ను సీఎం కేసిర్ అదేశించారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ తో పాటు, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, టియుడబ్లుజె ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, అవ్వారి భాస్కర్ తదితరులున్నారు..l

You missed