ఆయన ఓ పత్రికకు ఎడిటర్‌. ఆ పత్రిక కేసీఆర్‌కు అనుకూల పత్రిక. దుబ్బాక నియోజకవర్గంపై ఆ ఎడిటర్‌ కన్ను పడింది. అధికార పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ పోటీకి ఆయన సతీమణిని దింపినా… బీజేపీ గెలిచింది. దీంతో అధికార పార్టీలో శూన్యత ఏర్పడింది. స్థానికంగా స్థాన బలిమి కలిగిన ఈ ఎడిటర్‌ సాబ్‌ కన్ను దానిపై పడింది. ఈ మధ్య మెల్లగా ఈ ప్రస్తావన తీసుకువచ్చాడంట. తనకు ఎమ్మెల్యే కావాలని ఉంది. తనకు అక్కడ టికెట్ ఇవ్వాలని. దీంతో అధికారపార్టీ నేతలు కస్సుమంటున్నారట. ఇదెక్కడి తలనొప్పిరా బాబు.. ఎడిటర్ గా తన అనుకూల పత్రికకు అవకాశం ఇస్తే అంతా ఆగమాగం చేసి ఇప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడా..? అని చర్చ మొదలైందట. ఇదిప్పుడు మీడియా సర్కిల్‌లో చర్చ కొనసాగుతోంది.

You missed