తీన్మార్ మల్లన్న పై సోషల్ మీడియానే కాదు.. అన్ని వర్గాలు విరుచుకుపడుతున్నాయి. బీజేపీ పార్టీ నేతలు కూడా ఆయన వైఖరిపై భగ్గుమంటున్నారు. ఇసోంటోడిని తీసుకున్న బీజేపీ మూల్యం చెల్లంచకమానదు అని శాపనార్ధాలు కూడా పెడుతున్నారు. కేటీఆర్ కొడుకు హిమాన్షుపై బాడీ షేమింగ్కు పాల్పడ్డాడనే విషయంలో అన్ని వర్గాల నుంచి తీన్మార్ మల్లన్న పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తిట్టిన వారే కానీ, తిట్టని వారు లేరు.
ఈ విషయంలో కేటీఆర్ సంయమనం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ఇంతకు ముందు కూడా మంత్రి మల్లారెడ్డితో రేవంత్పై ఘాటు వ్యాఖ్యలు చేయించాడు. ఈట్ జవాబ్ పత్తర్ సే అని గట్టిగా శ్రేణులకు పిలుపునిచ్చాడు. కానీ ఈ సంకేతాలు కరెక్టుగా పోలేదు. తాజాగా తీన్మార్ మల్లన్నపై అన్ని వర్గాలు ఏకి పారేస్తున్న తరుణంలో కొంత మంది ఎమ్మెల్యేలు .. మరీ దిగజారి.. నోరు జారి మాట్లాడటం చర్చనీయాంశమైంది.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి నిన్న… బట్టలిప్పి కొడుతాం.. ఉరికిచ్చి కొడుతాం.. తన్నండి వాడిని.. చంపండి అని ఫ్యాక్షనిస్టు రేంజ్లో ఒళ్లు మరిచి శివాలూగాడు. ఇవాళ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా నోటికి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడాడు. మూడు ముక్కలు నరుకుతాం.. లమ్డీకొడుకా.. ఇంటికొచ్చి తంతా .. అని ఏవోవే వాగాడు. వాడేదో వాగాడని, మీరేదో వాగి నోరు జారి.. దిగజారి.. ఎందుకు ఇజ్జత్ తీసుకుంటరు. మీ ఇజ్జత్ కాదు పోయేది కేటీఆర్ది. కేటీఆరే ఇదంతా చేపిస్తున్నాడని, వీరితో మాట్లాడితపిస్తున్నాడని జనాలు అనుకుంటారు. వాస్తవానికి జరుగుతన్నది కూడా అదే.
మరీ ఇంత ఆవేశం పనికి రాదు కేటీఆర్. తీన్మార్ మల్లన్న తాట వలుస్తున్నారు అక్కడ. నీకెందుకు అంత ఆవేశం….? నీ శిష్యులను కొంచెం కంట్రోల్ చేయొచ్చు కదా. మంత్రి మల్లారెడ్డిని మెచ్చుకున్నట్టు వీరిని కూడా మెచ్చుకుంటావా ఏందీ.. ఇజ్జత్ పోతది.