Category: Local News

బాజిరెడ్డి దెబ్బ‌కు తోక ముడిచిన గ‌డీల రాములు ప్యాన‌ల్…. ఎన్నిక‌కు ముందే పోటీ నుంచి విర‌మించుకుని ముఖం చాటేసిన గ‌డీల వ‌ర్గం… బెడిసి కొట్టిన అలుక కిష‌న్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం……. ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఒలంపిక్ అసోసియేష‌న్ కొత్త కార్య‌వ‌ర్గం….. అధ్య‌క్షులుగా ఈగ సంజీవ్‌రెడ్డి, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా బొబ్బిలి న‌ర్స‌య్య‌….

జిల్లా ఒలంపిక్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మ‌లుపు తిరిగాయి. నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పావులు క‌ద‌ప‌డంతో ….. గ‌డీల రాములు వ‌ర్గం తోక‌ముడిచి ముఖం చాటేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌డీల…

అర్వింద్‌తో పొస‌గ‌లేం…! బీజేపీలో ఇమ‌డ‌లేం..!! టీఆరెస్ వైపు లైన్ క‌ట్టిన బీజేపీ కార్పొరేట‌ర్లు.. లీడ‌ర్లు…మిడిసిపాటు. గ‌ర్వ‌పోక‌డ‌. మీతిమీరిన వ్య‌వ‌హార దోర‌ణి… అర్వింద్‌ను ఒంట‌రి చేస్తున్నాయా..?

అర్వింద్ విజ‌య‌గ‌ర్వానికి గ‌ర్వ‌భంగం ప‌ట్ట‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు. త‌న వ‌ల్లే, తానే, తానే లేక‌పోతే ఇదంతా లేదు… నేను.. తాను… ఇదో ఇగో ఫీలింగ్‌లో బ‌తికేశాడు. బీజేపీకి అంతా తానే అనుకున్నాడు. గెలిచిన వారిని ప‌ట్టించుకోలేదు. పాత వారిని ప‌క్క‌కు…

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా మున్నూరుకాపు నారీలోకం…. ఐక్యంగా ఒక్క‌తాటిపైకి… కార్తీక మాస వ‌న‌భోజ‌నాల సంద‌ర్భం… క‌న్నుల పండువ‌గా వేడుక‌… మ‌హిళా విభాగం రాష్ట్ర అద్య‌క్షురాలు ల‌లిత నేతృత్వంలో తొలి వేడుక‌…. రాజ‌కీయంగా త‌మ స‌త్తా చాటే వేడ‌కా ఈ వేదిక‌…

గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని విధంగా ఇందూరు ఉమ్మ‌డి జిల్లా మున్నురుకాపు మ‌హిళా లోకం ఒక్క‌టి కాబోతుంది. ఒక్క వేదిక‌పైకి రాబోతుంది. ఒక్క చోట చేరి వ‌న‌భోజ‌నాల వేడుక‌లో పాల్గొన‌బోతున్నారు. దీనికి నిజామాబాద్ జిల్లా కేంద్రం వేదిక కాబోతుండ‌గా…. రాష్ట్ర ఉమెన్స్ డెవ‌ల‌ప్‌మెంట్…

క‌బ్జారాయుడు గ‌డీల‌కు చెక్ … చిత్తుగా ఓడ‌గొట్టేందుకు ధీటుగా బ‌రిలోకి… ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బాజిరెడ్డి… 13న ఎన్నిక‌లు… జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఎన్నిక‌…

అత‌నో క‌బ్జారాయుడు. బ్లాక్‌మెయిల‌ర్‌. సెటిల్‌మెంట్లు చేస్తూ బ‌తికే ఓ లీడ‌ర్‌. పెద్ద‌ల పేరు చెప్పి అక్ర‌మంగా సంపాదించుకునే క్యారెక్ట‌ర్‌. ఇదంతా కోణానికి ఒక‌వైపు. అది తెలియ‌క అత‌నికి జిల్లా ఒలంపిక్ అసోసియేష‌న్‌ను అధ్య‌క్షుడిని చేశారు అప్పుడు. నాలుగేళ్లకోసారి జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు.…

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల‌దోసే ప్ర‌య‌త్నం చేస్తున్న మోడీ.. – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా: కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, మోడీ స‌ర్కార్ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ…

పేదింటి స‌ర‌స్వ‌తికి…ఎంబీబీఎస్ చ‌దువు…. ఆర్థికంగా అండ‌గా నిలిచిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్ గూడ కు చెందిన హారిక కు కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్…

క‌రోనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆగ‌మాగం చేసినా.. కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాలను మాత్రం ఆప‌లేదు… ఆప‌ద‌లో ఆదుకుంటున్న ప‌థ‌కాలే పేద‌ల‌కు శ్రీ‌రామ ర‌క్ష‌…

క‌రోనా వ‌చ్చి ఆర్థికంగా అన్ని రంగాలు కుదేలవుతున్న సంద‌ర్భంలో కూడా సీఎం కేసీఆర్ పేద‌ద‌ల‌కండ‌గా ఉండే.. ఆదుకునే సంక్షేమ ప‌థ‌కాల‌ను మాత్రం ఆప‌లేద‌ని , తెలంగాణ ఆనాటి విప‌త్క‌ర స‌మ‌యంలో కూడా పేద‌ల‌కు అండగా నిలిచి దేశానికి ఆద‌ర్శంగా నిలిచింద‌ని జిల్లా…

ఇందూరు మున్నూరుకాపులు టీఆరెస్ వైపు…. ఆకుల ల‌లిత సార‌థ్యంలో కుల‌బాంధ‌వుల‌కు వ‌న‌భోజ‌నాలు… రాజ‌కీయంగా యూట‌ర్న్ తీసుకుని టీఆరెస్ వైపు చూస్తున్న మున్నురుకాపులు..

ఇందూరు జిల్లా… అందులో నిజామాబాద్ టౌన్‌…. మున్నూరుకాపుల అడ్డా. ఇక్క‌డా వీరి జ‌న‌భా అధికం. రాజ‌కీయంగా ప‌లుకుబ‌డీ అంతే. ప‌ర‌ప‌తీ పెద్ద‌దే. ఏ పార్టీ ఇక్క‌డ నుంచి గెల‌వాల‌న్నా మున్నూరుకాపుల బ‌లం, మద్ద‌తు అవ‌స‌రం. అంత‌లా రాజ‌కీయంగా వారి ప్ర‌భావం ఇక్క‌డ…

బీజేపీకి ఇది చెంప‌పెట్టు తీర్పు.. జాతీయ స్థాయిలో బీఆరెస్‌ను అడ్డుకునేందుకు అడ్డ‌మైన దారులు తొక్కిన బీజేపీకి త‌గిన గుణ‌పాఠం చెప్పిన మునుగోడు ప్ర‌జ‌లు…. ఇది కేసీఆర్‌కు వెయ్యేనుగ‌ల బ‌లం… ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ …నిజామాబాద్‌లో సంబురాలు…

మునుగోడులో టీఆరెస్ విజ‌యం సాధించ‌డంతో టీఆరెస్ శ్రేణులు నిజామాబాద్‌లో సంబురాలు చేసుకున్నారు. నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ త‌న క్యాంపు కార్యాల‌యం ముందు ప‌టాకులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. టీఆరెస్ గెలుపు ప‌ట్ల హర్షం వ్య‌క్తం…

న‌రేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే… అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారు … బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు…ఇది కేసిఆర్ అడ్డా.. 18వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు.. మా ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు.. బీజేపీ ప్రలోభాల కుట్రను బట్టబయలు చేసి యావత్ తెలంగాణ సమాజంతో శబాష్ అనిపించుకున్నారు.. బండి సంజయ్ కు సిగ్గు లేదు.. గుజరాత్ బానిసలా ఉండడం కంటే చావడం మేలు – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చౌటుప్పల్: ప్రధాని నరేంద్ర మోడీని,కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ప్రశ్నించి,వారి అవినీతిని ఎండగట్టే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్ మండలం డి…