కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల నిలిపివేతకు ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లా, బోధన ఆస్పత్రుల్లోనే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీహెచ్సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. సీహెచ్సీ సూపరింటెండెంట్ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, ఆపరేషన్ చేసిన సర్జన్ లైసెన్సును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తాత్కాలికంగా రద్దు చేసిందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, వారం రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామని చెప్పారు.