ఇంకెన్నేండ్లు చూస్తూ ఊరుకోవాలి. ఓపిక పట్టాలి. మా ఓపికకూ హద్దుంటుంది. అది నశించింది. ఇక చూస్తారు. చస్తారు అనే రేంజ్లో నిన్న కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. జర్నలిస్టు ముసుగులో ఒకడు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడని తీన్మార్ మల్లన్న గురించీ పరోక్షంగా తీశాడు. మహారాష్ట్రలో అరెస్టు చేసినట్టు చేస్తే మీరు ఊకుంటరా.. ప్రజాస్వామ్యం అని ఇంక ఏదోదో మట్లాడతరు.. అని పనిలో పని విలేకరులనూ కడిగేశాడు. ఆ తిట్లేందని వాళ్లను అడగరాదా? అని శివారెడ్డి అనే విలేకరికి చివాట్లు కూడా పెట్టాడు. మంత్రి మల్లారెడ్డిని కూడా వెనుకేసుకొచ్చాడు కేటీఆర్. అవును.. తప్పేముంది? అన్నడు. అవన్నీ కాదు.. సవాల్ను స్వీకరిస్తున్నాడా లేదా? అని డైరెక్ట్గా పాయింట్కు వచ్చాడు. కేటీఆర్ మంచి ఆవేశంలో ఉన్నాడు. కసి మీద ఉన్నాడు. ఇక తాట తీస్తాడు. అనే అర్థం వచ్చేలాగే మాట్లాడిండు. ఇక రంగంలోకి దిగినట్టున్నాడు. తీన్మార్ మల్లన్న అరెస్టుతో శుభారంభం పలికినట్టున్నాడు. సామబేధ దాన దండోపాయాల్లో …. ఇక చివరి ఘట్టం వచ్చినట్టుంది. దాసుడి తప్పు దండంతో సరి అని దండం పెట్టుకుంటారా? లేకపోతే కేటీఆర్ దండోపాయంలో దబిడిదబిడి అయిపోతారా? కాస్కోండి విలేకరులు….! లీడర్లు..!!
Related Post
కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం… ‘బిగాల’..? నిజామాబాద్ ఎంపీ బరిలో నిలిచేందుకు మంతనాలు.. తన కీలక అనుచరగణాన్ని కాంగ్రెస్లోకి పంపి.. ఆ తరువాత గణేశ్ గుప్తా కాంగ్రెస్లోకి ఎంట్రీ.. బీఆరెస్లో తన ఖాతా క్లోజ్ అయ్యిందనే భావనలో మాజీ ఎమ్మెల్యే.. కవితతో ఇందూరు బీఆరెస్లో పొసగని రాజకీయం.. పార్టీ క్యాడర్తో తీవ్ర ప్రచారం.. ఇంత జరిగినా ఎవరూ స్పందించని వైనం..
Feb 15, 2024
Dandugula Srinivas