రాష్ట్రంలో పొలిటికల్ వార్ హీటెక్కింది. మోడీ తొలిసారి కేసీఆర్ ఇలాఖకు వచ్చి తొడగొట్టాడు. మొన్న తుక్కుగూడలో అమిత్ షా మీటింగ్ తుస్సుమన్నది. ఇవాళ మోడీ గర్జన హిట్టయ్యింది. పొలిటికల్ హీట్ పెంచింది. వాస్తవంగా అధికారిక ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి వెళ్దామని మోడీ భావించాడు. కానీ బహిరంగ సభలో మాట్లాడాలనే ఒత్తిడి మేరకు మాట్లాడాడు. కానీ అలా కేసీఆర్ పై, కేసీఆర్ కుటుంబం పై విరుచుకు పడతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆఖరికి హార్డ్ కోర్ బీజేపీ ఫ్యాన్స్ కూడా. తెలంగాణ తెచ్చుకుంది ఒక్క కుటుంబం బాగు కోసం కాదని, అవినీతి పె రిగిందని, దీనికి చరమ గీతం పాడాలని, రెడీగా యువత ఉండాలని ….. చాలా మాట్లాడాడు మోడీ. ఎన్నికలు త్వరలో రానున్నాయనే సంకేతాలూ ఇచ్చాడు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా యూత్ రెడీగా ఉండి బీజేపీని గెలిపించాలని కూడా కోరాడు.
మూఢ నమ్మకాలను కేసీఆర్ నమ్ముతాడని, తాము సాంకేతిక అభివృద్ది కోరుకుంటామని కూడా చురకలేశాడు. కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పేందుకు పయనమయి… కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్న వేళ.. ఇక్కడ మోడీ గర్జన రాజకీయంగా హీట్ పెంచింది. ఇంత వరకు మోడీ నోటి వెంట ఇలాంటి మాటలు రాలేదు. తొలిసారి ఆయన కేసీఆర్ కుటుంబ పాలన గురించి విమర్శించడం… చర్చకు తెర తీసింది. బీజేపీ శ్రేణుల్లో ఇ ది కొత్త ఉత్సాహాన్నివ్వకగా.. టీఆరెస్ వర్గాలు ఖండనల మీద ఖండనలు ఇస్తున్నారు.