ఎన్నికలంటే హుజురాబాద్ గుర్తుకువచ్చేలా చేశారు. విచ్చలవిడి మద్యానికి, విచ్చలవిడి డబ్బు పంపకానికి, పదవుల పందేరానికే కాదు.. విచ్చలవిడి ఫేక్ న్యూస్కు కూడా ఇదే వేదికైంది. ఓ రకంగా ఇది కొత్త ట్రెండ్ను సృష్టించింది. ఎన్నడూ లేనంతగా టీఆరెస్ దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమే పాపమైపోయింది. పోటాపోటీగా తిట్టుకున్నారు. తన్నుకున్నారు. ఫేక్ వార్తలతో కొట్టుకున్నారు. బురదలో పడి దొర్లాడారు. కొత్త కొత్త ఎన్నోవేషన్ మార్ఫింగ్ కథనాలు అల్లారు. ఫేక్ వార్తలతో అసలు నిజమేదో ..? అబద్దమేదో తెలియనంతగా భ్రమల్లో ముంచారు. కరోనా వేళ.. ఏ రోజు ఎవరి చావు వార్త వినాల్సి వస్తుందోనని ఫోన్ చూడాలంటేనే భయపడే రోజులు.. మళ్లీ హుజురాబాద్ ఎన్నికలోనే చూశాం. అంతటి జుగుప్సాకరమైన, భయంకరమైన, వికారమైన పోటీ అది.
ఇక ఎన్నిక ఏదైనా .. పార్టీలేవైనా.. ఇదే పంథాను అనుసరించాలి కాబోలు. చచ్చినట్టు అనుసరించేలాగే చేసింది మరి హుజురాబాద్ ఎన్నిక. ఇక ఆ ఎన్నిక ఒడిసింది… ఎక్కడికక్కడ సద్దుమణిగింది కదా.. అని హాయిగా ఉందామనుకున్నా.. ఉండనిచ్చేలా లేరు ఈ ఇన్నోవేషన్ సృష్టికర్తలు. తాజాగా రజినీకాంత్ గుంజుకొచ్చి ఓ ఫేక్ కామెంట్ ఒకటి కొట్టి అలా పాడేశారు సోషల్ మీడియాలో. ఈ ఫేక్ ఎవరు చేసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా బాసు.. చూస్తే అర్థం కావడం లేదూ…!
