నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఓకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజి,జనరల్ సర్జరీ,ఆర్థోపెడిక్, ఈఎన్టి, అప్తమాలజి విభాగాలలో ఈ సర్జరీలు చేయడం ప్రభుత్వ హాస్పిటల్స్ మెరుగైన పనితీరుకు నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలని కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అన్ని రకాల అదునాతన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. 59 ఆపరేషన్లు చేసి రికార్డు నెలకొల్పిన ఆయా విభాగాల అధిపతులను,డాక్టర్లను,ఆసుపత్రి సూపింటెండెంట్ ప్రతిమా రాజ్ ను మంత్రి , క‌విత‌ప్రత్యేకంగా అభినందించారు.

You missed