పిల్లలకు కరోనా వాక్సిన్ ( టీకా ) అవసరం లేదు. వేయించొద్దు.
దాని వల్ల కలిగే లాభం కన్నా నష్టం ఎక్కువ.
నేను వాక్సిన్ వ్యతిరేకి కాదు. లాభనష్టాలను బేరీజు వేసుకొని పెద్దలు రెండు డోసుల వాక్సిన్ వేసుకోవడాన్ని నేను సమర్తించాను.
పిల్లల విషయం వేరు. వారికి కరోనా సోకినా ఏమీ కాదు. వాక్సిన్ వల్ల అనేక నష్టాలు. కొంతమందికి గుండెపోటు రావొచ్చు. వీరి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఒక తల్లి గుండె కోత అయినా భరించరానిది.
దీర్ఘకాలం లో వాక్సిన్ వేయించుకున్న పిల్లలు
1 . తీవ్రమైన ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కు
2 . ఎలర్జీ ల కు గురయ్యే అవకాశం వుంది.
కరోనా వాక్సిన్ ను మిగతా వాక్సిన్ ల తో పోల్చవద్దు. కనీసం 5 – 6 సంవత్సరాల పరీక్షల తరువాత వాడకానికి పూర్తి స్థాయి అనుమతులతో పోలియో లాంటి వాక్సిన్ లు వచ్చాయి. కరోనా వాక్సిన్ కు కేవలం అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి మాత్రమే అనుమతి వచ్చింది. మొదటి రెండు వేవ్ ల లో మన దేశం లో కరోనా బారిన పడి పిల్లలు మరణించారా ? లేదు. ఇప్పుడు వస్తున్నది తేలికపాటి లక్షణాలు కలిగించే ఓమిక్రాన్. మరి అత్యవసర పరిస్థితి ఉందా ?
ఆలోచించండి. పూర్తి స్థాయి అనుమతులతో టీకా వస్తే అప్పుడు వేయించవచ్చు. తొందర వద్దు.
దయ చేసి ప్రభుత్వాలు పిల్లలకు టీకా కార్యక్రమాన్ని కేవలం తల్లి తండ్రుల అనుమతి తో నే నిర్వహించాలి. తల్లితండ్రులను బలవంత పెట్టొద్దు.
పెద్దల్లో టీకా ప్రభావం వల్ల కనిపిస్తున్న ఫలితాలు.
1 . అధిక శాతం పెద్దలపై ఇది ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపడం లేదు.
2 . అక్కడక్కడా కొంతమంది గుండెపోటు తో మరణిస్తున్నారు.
3 . కొంతమంది స్త్రీలలో పీరియడ్స్ సరిగా రావడం లేదు.
4 . కొంతమందిలో మతిమరపు సమస్యలు వస్తున్నాయి.
(Amarnath Vasireddy)