తీన్మార్ మల్లన్న, నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. ఇంకా మరో ఇద్దరు అంతా కలసి మందు తాగారు. సరదాగా ఓ ఫోటో తీసుకున్నారు. దాన్ని అలవాటు ప్రకారం సోషల్ మీడియాలో వదిలారు. ఏం చేసినా.. సోషల్ మీడియాతో పంచుకోవడం అదో ఫ్యాషన్ అయిపోయింది కదా. ఇంత వరకు బాగానే ఉంది. దీన్ని నఖశిఖ పర్యంతం గమనించిన టీఆరెస్ శ్రేణులు, అభిమానులు… టీఆరెస్ సోషల్ మీడియా వారియర్లు ఉన్నపలంగా యురేఖా అని పేద్ద గావుకేక పెట్టి ఎగిరి గంతేశారు.
వాళ్లకు కింద టేబుల్ కింద ఓ బ్లెండర్ స్పైడ్ ఫుల్ బాటిల్ కనిపించీ కనిపించకుండా.. అలా నల్లగా నిగనిగలాడుతూ కనిపించింది. ఇంకేముంది…? ఇక రంగంలోకి దిగారు. దిగితే దిగారు కానీ కింద మందు బాటిల్ ఉంది సూసుకోబడ్లా…అని ఓ వెర్రి , వ్యంగ్య, హాస్యోక్తి వదిలారు. సరదాగా అర్వింద్ టీమ్ వదిలిన ఆ ఫోటోను వీళ్లు అలా కాపీలు పేస్టులు, షేర్లు.. సవ్వా షేర్లు చేసుసుకున్నారు. ఇష్టమొచ్చినోళ్లు ఇష్టమొచ్చిన కవిత్వం ఒలకబోశారు. ముందే మందు తాగే సమయమాయే.. తాగి ఉన్నారేమో కొందరు… అలా మత్తుగా చిత్తుగా అర్సకుని కర్సుకుని వదిలేశారు.
అసలు తెలియక అడుగుతా… మందు తాగి ఉన్నారేమో.. అయితే తప్పేంటట.. ఓహో తాగితే తాగారు కానీ కనిపించకుండా తాగాలి. తాగినా తాగనట్టు స్టడీ గా, బుద్దిమంతుల్లా ఉండాలి. తాగినా.. కింద సీసాలు కనిపించకుండా చూసుకోవాలి. అలా కాక ఇలా చేస్తే.. బుద్ది మంతులవరు.. మందు మందబుద్దులవుతారు… తస్మాత్ జాగ్రత్త…!!