పొద్దున్నే ఓ వీడియో కనిపించింది సోషల్ మీడియాలో. అది చూడగానే నవ్వొచ్చింది. ఎస్వీ కృష్టారెడ్డి దర్శకత్వంలో వచ్చిన వినోదం సినిమా గుర్తొచ్చింది. అందులో కోట శ్రీనివాసరావును నమ్మించేందుకు హీరో, అతని స్నేహ బృందం ఉత్తుత్తి బ్యాంకు ఏర్పాటు చేసి బురిడీ కొట్టిస్తారు. అచ్చం హుజురాబాద్లో మంత్రులు నివాసం ఉంటున్న గెస్ట్ హౌజ్లను పోలీసులు తనిఖీ చేయడం అలాగే అనిపించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే సినిమా డైలాగ్ కూడా గుర్తొచ్చింది.
అసలక్కడ ముగ్గురు మంత్రలు ఇన్ని రోజుల పాటు తిష్ట వేయడమే పెద్ద అక్రమం. ఎంతో అధికార దుర్వినియోగానికి అది నిదర్శనం. ప్రజలకు ఇవన్నీ తెలియవా..? పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగిన చందంగా .. పాపం ప్రజలు అమాయాకులు వారికేం తెలియదు అని నాయకులనుకుంటారు కాబోలు. అందుకే అప్పుడప్పుడు ఇలా కనికట్టు విద్యలను ప్రదర్శించి నవ్వులపాలవుతూ ఉంటారు. అవునూ.. ఇప్పుడు మంత్రుల ఇండ్లే తనిఖీ చేశారంటే.. ఈరోజు, రేపు బీజేపీ లీడర్ల బ్యాండ్ బజాయిస్తారన్నమాట. మంత్రులనే వదల్లేదు బై.. మీరో లెక్కా… అని ఏ పొక్కలో ఉన్నా కట్టల పాములను బయటకు లాగి.. ప్రజలకందకుండా చేస్తారు కావొచ్చు. టీఆరెస్ కట్టల పాములు మాత్రం ప్రజలకు సరిగ్గానే అందే అవకాశం ఉంది. బీజేపీ కట్టల పాములనే పోలీసులు పట్టుకుని బుట్టలో కమ్మేస్తారు. అదే జరుగుతుంది.