హుజురాబాద్‌లో మీడియా అంతా ఒక్క‌దిక్కైంది. టీఆరెస్ మీడియాను కొనేసింది. ఈట‌ల రాజేంద‌ర్‌కు ఏ మీడియా అండ‌గా లేదు. ఉన్న‌దున్న‌ట్టు చెప్పేందుకు కూడా ఏ మీడియా ముందుకు రావ‌డం లేదు. అంతా టీఆరెస్ పాటే పాడుతున్నాయి. ల‌క్ష‌లు గుమ్మ‌రిస్తున్నాడు హ‌రీశ్‌రావు మీడియాకు. ఎంత డ‌బ్బు కావాల‌న్నా ఇచ్చేస్తున్నాడు. గుంజేసుకుంటున్నాడు. ఈట‌ల రాజేంద‌ర్‌ను మీడియా ఒక‌ర‌కంగా బ‌హిష్క‌రించింది.

ఒక కెమెరామెన్‌ను పెట్టుకున్న ఈట‌ల.. దాంతోనే వీడియోలు తీసి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేసుకుంటున్నాడు. శ‌క్తుల‌న్నీ టీఆరెస్ వైపే ఉన్నాయి. ఈట‌ల‌ను శ‌క్తి హీనుడిన చేసేశారు కేసీఆర్‌, హ‌రీశ్ రావులు.డ‌బ్బులు గుమ్మ‌రిస్తున్నారు. ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. కోట్లు ఖ‌ర్చైనా వెనుకాడ‌టం లేదు. ఏ ఒక్క సెక్ష‌న్నూ వ‌ద‌ల‌డం లేదు. ల‌క్ష నుంచే మొద‌లు.. ఆపై ఎంతంటే అంత‌. మీడియా కూడా ఈ బేరంలో అమ్ముడుపోయింది. ఈట‌ల‌కు స‌పోర్టు చేయ‌డం లేదు. అంతా హ‌రీశ్‌రావు ఏలుబ‌డిలో న‌డుస్తున్న‌ది వ్య‌వ‌హారం. ఈట‌ల అన్ని ర‌కాలుగా ఒంట‌ర‌య్యాడు. ఆఖ‌రికి మీడియా ప‌రంగా కూడా.

You missed