నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో విజయరాజ్ అనే పాస్టర్ ఓ మైనర్ బాలికను (14) అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చంది. దిక్కు మొక్కులేని వడ్డెర కులానికి చెందిన ఓ మైనర్ బాలికను లోబర్చుకున్న పాస్టర్ ఆమె పై అత్యాచారం చేయడంతో ఆరు నెలల గర్భవతి అయ్యింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నిజామాబాద్ కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉన్న సఖీ సెంటర్లో బాధితురాలి తల్లి, అత్త పాస్టర్ విజయరాజ్ బాలికను రేప్ చేసినట్లు ఫిర్యాదు చేశారు.
కానీ ఈ కేసును నందిపేట్ పోలీసులు పక్కదారి పట్టించారు. ప్రేమ పేరుతో అనిల్ అనే యువకుడు అత్యాచారం చేసినట్లుగా ఫిర్యాదు స్వీకరించారు. దీనిపై గందళగోళం నెలకొన్నది. వాస్తవాలు వెలుగు చూడాల్సి ఉంది.