బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ వేసిన ఉచ్చులో మైనంపల్లి హన్మంతరావు చిక్కాడు. కంట్రోల్ తప్పి.. కట్టుబాట్లు విడిచి ఇష్టారీతిన మీడియా ముందు మాట్లాడాడు. ఈ రోజు మల్కాజిగిరిలో జరిగిన పరస్పర దాడిలో మైనంపల్లి హన్మంతరావు అనుచరులు .. బీజేపీ కార్పొరేటర్ను చితకబాదారు. దీంతో బండి సంజయ్ రంగ ప్రవేశం చేశాడు. ఇలాంటివే బండికి కావాల్సింది. ఇంకేముంది? రెచ్చగొట్టి వదలిపెట్టాడు. ఇక రెచ్చిపోయాడు హన్మంతరావు. పక్కా రౌడీషీటర్లా.. గల్లీ లీడర్లా .. మాట్లాడి ఇజ్ఙత్ తీసుకున్నాడు.
ఇదే కావాలి బండికి. బీజేపీ వేసిన ఉచ్చులో టీఆరెఎస్ లీడర్లు ఎలా ఇరుక్కుని, గింజుకుని, బయటకు వెళ్లలేక ఎలా గిలగిలా కొట్టుకుంటున్నారో మైనంపల్లి ఉదంతం మంచి ఉదాహరణ. అంతటా మైనంపల్లి బ్యాచే ఉంది. తెలివి తక్కువ. ఆవేశం ఎక్కువ. నేను పోటును అని చెప్పే క్రమంలో దిగజారి మాట్లాడి.. తనకు తాను పాతాళంలోకి పడిపోయాడు. బీజేపీని పెంచి పోషించేందుకు ఇలాంటి మైనంపల్లిలో చాలా ఉన్నారు కేసీఆర్. వాళ్ల ఐడియా మీకు తెల్వదు. వాళ్ల ఎత్తుగడ మీ అంచనాకు ఉండదు. అందుకే ఆ సాలెగూడులో చిక్కుకుని మీకు మీరే చచ్చిపోతున్నారు. నీ ఒక్కడి తెలివి ఉంటే సరిపోదు కేసీఆర్. మీ అనుచరులకూ ఉండాలె. ఇలా కనీస విజ్ఞత లేని నేతలను వెంటబెట్టుకుని ఇంకా ఎన్ని రోజులు అధికారాన్ని నెట్టుకొస్తావు కేసీఆర్…? కష్టమే.