పొరుగు రాష్ట్రం నుంచి పొట్ట చేత‌బట్ట‌కుని కూలీ ప‌నుల కోసం నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లికి వ‌చ్చింది ఓ వ‌ల‌స కుటుంబం. నిత్యం మేస్త్రీ ప‌ని చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. అయితే త‌న అల్లుడు ప‌ని చేసుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడ‌ని ఓ రోజు మంద‌లించాడు సంజీవ్ రావు షిండే. నాజీలానీ షిండే కూడా త‌న బావ‌ను మంద‌లించాడు. ప‌ని చేసుకోక‌పోతే ఎలా? ఇక్క‌డికి వ‌చ్చింది జులాయిగా తిర‌గ‌డానికా? అని గ‌ట్టిగా మంద‌లించాడు. కోపోద్రుక్తుడైన శివానంద్ ఇంట్లో ఉన్న క‌త్తి తీసుకుని ఇద్ద‌రి పై విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేసి చంపేశాడు.

You missed