ఆమె ఓ ద‌ళిత మ‌హిళ‌. పెళ్లైంది. ఇద్ద‌రు పిల్ల‌లు. భ‌ర్త పొట్ట చేత‌బ‌డ్డుకుని గ‌ల్ఫ్‌కు వెళ్లాడు. ఈ స‌మ‌యంలో ఈమె పై క‌న్నేసిన బీజేపీకి చెందిన ఓ కామంధుడైన నేత మాయ‌మాట‌లు చెప్పి లోబ‌ర్చుకున్నాడు. ఆమెతో అక్ర‌మ సంబంధం కొన‌సాగించాడు. ఇటీవ‌ల భ‌ర్త గ‌ల్ఫ్ నుంచి తిరిగి వ‌చ్చాడు. ఈ విష‌యం తెలుసుకున్నాడు. త‌మ కుల సంఘం నేత‌ల‌తో క‌లిసి బొక్క‌లు ఇరిగేలా బీజీపీ నేతను త‌న్నాడు. త‌న్నిపించాడు.

వివ‌రాల్లోకి వెళ్తే… నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మ్మ‌ర్‌ప‌ల్లి మండ‌ల బీజేపీ అధ్య‌క్షుడు న‌వాతే రంజిత్‌కు ఫ‌ర్టిలైజ‌ర్ షాపు ఉంది. ఈ ద‌ళిత మ‌హిళ తో కొన్ని రోజులుగా అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తున్నాడు. భర్త గ‌ల్ఫ్ నుంచి వ‌చ్చినా కూడా ఆమెకు వీడి నుంచి వేధింపులు త‌ప్ప‌లేదు. దీంతో కోపోద్రుక్తుడైన ఆమె భ‌ర్త త‌న కుల సంఘం నేత‌ల‌కు చెప్పి ఆ ఫ‌ర్టిలైజ‌ర్ షాపులోనే బొక్క‌లు ఇరిగేలా త‌న్నాడు. రంజీత్ పై అట్రాసీటి కేసు న‌మోదు చేశారు పోలీసులు. బీజేపీ ఎంపీ అర్వింద్‌కు విషయం తెలిసి దీనిని క్రాంప‌మేజ్ చేయాల‌ని చూశాడు. క‌మ్మ‌ర్‌ప‌ల్లి మండ‌ల టీఆరెస్ ఎంపీటీసీతో మంత‌నాలు జ‌రిపాడు. కేసు నుంచి బ‌య‌ట ప‌డేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

You missed