ఢిల్లీ టిఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం

అధినేత కేసీఆర్ గారు విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి

కీలక ఘట్టంలో నాకు భాగస్వామ్యం కల్పించిన కేసిఆర్ గారికి ధన్యవాదాలు

– మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి

న్యూ ఢిల్లీ:

పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ నడి బొడ్డున తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచే టిఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేసిఆర్ గారి ఆదేశానుసారం పార్టీ భవన్ నిర్మాణ పనులు మంత్రి మొదటి నుంచే దగ్గరుండి పర్యేక్షిస్తున్నారు.నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్నారు.MDP ఇన్ఫ్రా నిర్మాణ సంస్థ భవన్ నిర్మాణ పనుల బాధ్యతలు అప్పగించారు.
ఇవాళ లాంఛనంగా భవన్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. కేసిఆర్ గారు విధించిన నిర్ణీత గడువులోగా టిఆర్ఎస్ భవన్ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీ నామా నాగేశ్వరరావు,నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.

You missed