(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
ఇమ్రాన్ఖాన్ మరణించిన వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ జ్యూడిషియల్ కస్టడీలో హత్యకు గురైనట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతను భద్రంగానే ఉన్నట్టు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెక్సీ క్రికెటర్ గా పేరొందిన ఇమ్రాన్ ఖాన్పై వారం రోజులు క్రితం ఓ ఆర్మీ అధికారి అతనిపై లైంగిక దాడికి చేయబోయాడన్నవార్తలు సంచలనం రేపుతున్నాయి. రావల్పిండి అడియాల జైలులో హత్యకు గురైనట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ధ్రువీకరించలేదు. వాస్తవానికి ఇండియా పాకిస్తాన్ యుద్దం జరుగుతున్న నేపథ్యంలో ఆయనను విడుదల చేయాలనే డిమాండ్ రెండు మూడు రోజులుగా పెల్లుబుకుతుంది.
ఆయన అనుచరుడికి బెయిల్ కూడా లభించింది. ఈ క్రమంలో ఇవాళ బెయిల్పై విడుదలైనట్టు వార్తలు వచ్చాయి. ఇంతలోనే అల్ జజీరా లాంటి ప్రముఖ చానెల్లో ఇమ్రాన్ ఖాన్ మరణ వార్త ప్రత్యక్షమైంది. అప్పుడే యుద్దం ఆగింది. వాస్తవానికి ఇమ్రాన్ఖాన్ మధ్యాహ్నమే మరణించినట్టు ధ్రువీకరించినా పాక్ ప్రభుత్వం గోప్యంగా ఉంచిందని తెలుస్తున్నది. ఒకవైపు యుద్దం, మరోవైపు ఇమ్రాన్ మరణవార్త దేశాన్ని అతలాకుతలం చేస్తుందని భయపడ్డ పాక్ అధికారులు అమెరికాను ఆశ్రయించారు. ట్రంప్ మధ్య వర్తిత్వం నెరిపి వెంటనే యుద్దం ఆపాలని భారత్ను అభ్యర్థించింది. మానవతా దృక్పథంతో భారత్ కాల్పుల విమరణ ప్రకటించారు.