(దండుగుల శ్రీనివాస్)
వరంగల్ సభను భగ్నం చేయడానికి, మధ్యలో అవంతరాలు సృష్టించడానికి కాంగ్రెస్ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తదని, ఈ ప్రభుత్వంపైన తమకు నమ్మకం లేదన్నాడు కేటీఆర్. కరెంటును ఇష్టానుసారం తీసేస్తున్నారని, సభ జరిగే రోజు ఎన్నిసార్లైనా కరెంటును తీసేయడానికి వెనుకాడరని, అందుకే సర్కార్పై నమ్మకం లేకనే 200 జనరేటర్లు తెచ్చి పెట్టుకున్నామని వ్యాఖ్యానించాడు. వరంగల్లోని ఎల్కతుర్తి సభ ఏర్పాట్లు పరిశీలించిన తరువాత అక్కడే మడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇది ప్రభుత్వానికి తిట్టేందుకు పెట్టే సభ కాదన్నాడు. అట్లాగే జనాలను రెచ్చగొట్టడానికి కూడా పెట్టడం లేదన్నాడు.
తమ పార్టీ రజతోత్సవ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని పెట్టుకుంటున్నామని, బహుశా ఇలాంటి మీటింగు గతంలో జరిగి ఉండదని, భవిష్యత్తులో జరగదన్నాడు. అంతలా జనం రావడానికి ఉత్సాహంగా ఉన్నారని, ఆ స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తున్నామన్నాడు. కేసీఆర్ ఏం మాట్లాడుతాడో వినేందుకు జనం సర్వత్రా ఆసక్తి చూపుతున్నాడన్న కేటీఆర్… ఆయన మాటలు వింటే జనంలో ధైర్యం వస్తుందని, అదే మాట వారుంటున్నారని, ఇంకా ఇంకా వాహనాలు సమకూర్చాలని కోరుతున్నారని అన్నాడు. ఇప్పటి వరకైతే ప్రభుత్వ సహకారం బాగానే ఉందని, మున్ముందు చప్పలేమన్నాడు. అందుకే తమ ఏర్పాట్లలో తామున్నామని పేర్కొన్నాడు.