(దండుగుల శ్రీనివాస్)
రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడట. అట్లనే ఉన్నది కేసీర్ తీరు. ఆయనంతే. ఆ స్టైల్ డిఫరెంట్. ఎవరికీ అర్థం కాడు. ఫామ్హౌజ్ నుంచి బయటకు వస్తావా..? రావా..? అని అరిచి అరిచి రేవంతు రెడ్డి గొంతుపోయింది కానీ, ఆయన మాత్రం వినిపించుకోలేదు. ఇక కంచె గచ్చిబౌలి భూములను సర్కార్ అమ్ముకోజూస్తున్న క్రమాన్ని అన్ని సెక్షన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అన్ని పక్షాలూ స్పందిచాయి. కానీ కేసీఆర్ స్పందించలేదు. షరా మామూలుగా. కానీ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వరంగల్లో ఈనెల 27న జరిగే రజతోత్సవ సభ కు సంబంధించిన ఏర్పాట్లపై మాత్రం మీటింగు పెట్టుకున్నారు.
అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నాడు. ఎందుకు హెచ్సీయూ భూములపై స్పందించలేదు..? ఏమో ఆయన గతంలో కోకాపేట భూములు అమ్ముకున్నాడు కదా.. దీనిపై మాట్లాడితే బాగుండదనుకున్నాడో…? లేక తను కూడా అదే చేసేవాడిని కదా అధికారంలో ఉంటే..నని సర్థిచెప్పుకున్నాడో తెలియదు. కానీ, ఇప్పుడే ఆ వరంగల్ మీటింగు కోసం టైమివ్వాలా..? ఎప్పుడూ ఉన్నట్లు సైలెంట్గా ఉంటే సరిపోతుండె. ఇక్కడ కేటీఆర్ ఈ అంశాన్ని పార్టీకి మైలేజీ తెచ్చే విధంగా ఎంత కష్టపడుతున్నాడో తెలుసా..? కేసీఆర్ మాత్రం చేసిందేమీలేదు.. చేసేవాడికి మూడు, ఉత్సాహం లేకుండా చేస్తాడు. ఇలాగే.