(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఇవ‌న్నీ ఒక్క‌రినుద్దేశించి అన్న‌వే. ఎవ‌ర‌న్నారు..? ఎవ‌ర్న‌న్నారు..? ఎందుక‌న్నారు..? అంత తీవ్ర ప‌ద‌జాలం, తీవ్ర ఆరోప‌ణ‌లు ఎందుకు చేశారు..? ఇప్ప‌టికే మీకు తెలిసే ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి … కేటీఆర్‌నుద్దేశించి అన్న మాట‌లివి. ఆయ‌న పెట్టిన ప్రెస్‌మీట్‌లో మూసీ గురించి ఆమూలాగ్రం వివ‌రించి చెప్ప‌డంతో పాటు కేటీఆర్‌నూ ఇలా అర్సుకున్నాడు త‌న‌కు అల‌వాటైన దోర‌ణిలో. అయితే ఈసారి అంత‌కు మంచి. మొద‌ట‌గా మూసీ అంశం గురించి ప్రస్తావిస్తూ కేటీఆర్ మూసీపై గోబెల్స్ ప్ర‌చారానికి దిగాడ‌ని దుయ్య‌బ‌ట్టిన రేవంత్‌.. ఆఖ‌రికి త‌నకు, పార్టీకి అనుకూల మీడియా కూడా అవునా..? రేవంత్ చేస్తుంది త‌ప్పా..? అని అనుమాన ప‌డే విధంగా అబ‌ద్దాలు ప్ర‌చారం చేయ‌డంలో స‌క్సెస‌య్యాడ‌ని చెప్పుకొచ్చాడాయ‌న‌.

అంతే కాదు. మూసీ బ్యూటీఫికేష‌న్ అని కేటీఆర్ దీనికి నామ‌క‌ర‌ణం చేశాడ‌ని, సుంద‌రీక‌ర‌ణ అని తానెప్పుడూ చెప్ప‌లేద‌న్నారు. ప‌నిలో ప‌ని కేటీఆర్ ఈ అంశంలో బాగానే అర్సుకుని క‌ర్సుకున్నాడు. అదేమంటే.. నీలా అంద‌లా వెంట ప‌డి చేప‌ట్టింది కాదంటూ.. సినీ తారాల నేప‌థ్యాన్ని ప‌రోక్షంగా ఇక్క‌డ ప్ర‌స్తావించ‌డం చ‌ర్చ‌కు తెర తీసింది. ఇంత‌టితో వ‌దిల‌లేదు. విదేశాల‌కు పోయి బ‌ట్ట త‌ల‌పై జుట్టు ప్లాంటేష‌న్ చేయించుకునే నీలాంటి అంద‌కోసం పాకులాడే కార్య‌క్ర‌మం కాదిది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక క‌స‌బ్ పేరొందుకొచ్చిందో చూద్దాం. వికారాబాద్‌లో ప్రారంభం చేసిన నేవీ రాడార్ స్టేష‌న్‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న కేటీఆర్‌కు ఈ పేరు పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు రేవంత్‌. దేశ‌భ‌క్తి లేనోడు క‌స‌బ్ లాంటోడో అని చెబుతూ.. కేటీఆర్ కూడా క‌స‌బ్ కావాల‌నుకుంటున్నాడు. అలా అయితే అత‌న్ని చూసుకునే వ్య‌క్తి ఒక‌డొస్తాడ‌ని డెడ్లీ వార్నింగ్ కూడా ఇవ్వ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌టితో ఆగ‌లేదు. గండిపేట్ చెరువును 111 జీవోను అడ్డం పెట్టుకుని మొత్తం మింగేశాడ‌ని కూడా తీవ్ర ఆరోప‌ణ చేశాడు సీఎం.