అర్వింద్ … ఏ సందర్బాన్నైనా తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటాడు. ఇవాళ హైదరాబాద్లో అర్వింద్ ఇంటిపై కొందరు టీఆరెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం కలకలం రేపింది. ఒకరిపై , ఇంటిపై దాడి చేయడం సమర్థనీయం కాదు. ఆక్షేపనీయమే. ఇక్కడ అర్వింద్ టీఆరెస్ను ఇరుకున పెట్టేలా ఎత్తుగడ వేశాడు. కానీ అది కాస్త బెడిసికొట్టింది. అదేంటంటే…. దాడి సమయంలో తన తల్లి ఇంట్లో ఉందని, ఆమెను బెదిరించారని, ఆమెపై దాడి చేశారని విరుచుకుపడ్డాడు.
ఆ తర్వాత ఓ మీడియా చానల్ ఆమెను పలకరించగా అసలు విషయం బయటపడ్డది. తను ఆ సమయంలో ఇంట్లో పైన ఉన్నానని, కింద ఏం జరుగుతుందో కూడా తెలియదన్నారామె. తర్వాత కిందికి వచ్చి చూస్తే వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయని చెప్పుకొచ్చారు. అర్వింద్ ఈ దాడిని తల్లి సెంటిమెంట్తో మొత్తం రివర్స్ చేద్దామనుకున్నాడు. కానీ ఆ పాచిక పారలె. దేవుళ్ల ఫోటోలను కూడా ధ్వంసం చేశారని అర్వింద్ అన్నాడు. కానీ తెలివున్నోడెవడు.. బుద్దున్నోడెవడూ దేవుళ్ల ఫోటోల జోలికి పోడు. కానీ అర్వింద్ అదీ తనదైన శైలిలో చెప్పేసి టీఆరెస్ను ఇరుకున పెట్టాలని చూశాడు. కానీ పెద్దగా స్పందన లేకపోగా..తన వ్యూహం పెద్దగా ఫలించలేదు. దీన్నే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.