రోడ్డు యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ సినీహీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. రేసింగ్బైక్ పై అతివేగంగా డ్రైవ్ చేసి స్కిడ్ అయి పడిపోయాడు. ఈ రోజు అతను పూర్తిగా కోలుకున్నాడని మెగా ఫ్యామిలీ ఓ ఫోటోను మీడియాకు రిలీజ్ చేసింది. తమ కుటుంబ సభ్యుల కు ఇది నిజమైన పండుగ అంటు మెగా స్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు. అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశాడు.
