ప్లీనరీలో కేసీఆర్ను మళ్లీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇది పేరుకే. తెరవెనుక అంతా కేటీఆర్కు అధికారాలు చక్కబెట్టే కార్యక్రమం ఈ వేదికగా పూర్తయ్యింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కు ప్రెసిడెంట్కు ఉండే అధికారాలన్నీ అప్పచెప్తూ బైలాస్లో మార్పులు చేశారు. దీన్ని ప్లీనరీలో తీర్మానించారు.
కేసీఆర్ ఇకపై పార్టీ వ్యవహారాల్లో నిమిత్తమాత్రుడు. ప్రభుత్వ కార్యక్రమాల్లోకొన్ని రోజల పాటు ఆయన బీజీగా ఉంటాడు కావొచ్చు. యాదాద్రి తర్వాత ప్రభుత్వమూ కేటీఆర్ హస్తగతం చేయాలనే ఆలోచన కేసీఆర్కు ఉంది. ముందుగా పార్టీ పూర్తి అధికార పగ్గాలను ఈ ప్లీనరీ వేదికగా కేటీఆర్కు అప్పగించేశాడు కేసీఆర్. అంతా అనుకున్నట్టు మళ్లీ కేసీఆర్ ప్రెసిడెంట్ అయినా… కేసీఆర్కే సర్వ అధికారాలు కట్టబెట్టాడు కేసీఆర్. ఇక పార్టీ స్టీరింగ్ పూర్తిగా కేటీఆర్ చేతికి వచ్చేసింది. వెనుక నుంచి నిమిత్త మాత్రుడిగా కేసీఆర్ చూస్తుంటాడు అంతే.
త్వరలో పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో కేటీఆర్ ముద్ర ప్రత్యేకంగా కనపించనుంది. రానున్నది కేటీఆర్ తరం. ఇటు పార్టీలో త్వరలో ప్రభుత్వంలో కేటీఆర్ తన కోటరీ ఏర్పాటు చేసుకోనున్నాడు. ఇప్పట్నుంచి అందుకు అన్ని ప్రణాళికలు చక చకా సిద్దం చేసుకుంటున్నాడు. మామూలుగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది అన్ని పార్టీలో ఆరో వేలు లాంటిది. ఈ పదవి వల్ల పెద్దగా వారికి ఒరిగేది ఏమీ ఉండదు. పనులు చేయాలి తప్ప నిర్ణయాలు తీసుకోలేరు. మళ్లీ అధ్యక్షుడు కావాల్సిందే. ఇకపై టీఆరెస్లో ఈ పరిస్థితి లేదు. నిబంధనలు మార్చారు. బైలాస్లో మార్పులు చేశారు.
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటే అయినా.. ప్రెసిడెంట్ తీసుకునే సర్వ అధికారాలు ఇతనికీ ఇకపై వర్తిస్తాయి అనేది ఈ బైలాస్ మార్పులో కీలకాంశం. ఎవరికి తెలియకుండా మెల్లగా ఈ అధికారాలను కేటీఆర్కు ఇంజెక్టు చేశారు. పార్టీలో హరీశ్రావు లాంటి అసమ్మతివాదులు, అసంతృప్తులు అక్కడక్కడా ఉన్నా.. వారికి తెలియకుండానే , నొప్పి కలగకుండా తను అనుకున్నది పూర్తి చేశాడు కేసీఆర్. ఇటు ప్రజల్లో, అటు ప్రభుత్వంలో మెల్లగా కేటీఆర్ ప్రాతినిథ్యాన్ని అర్థం చేసుకోవాలి… దానికి తగ్గట్టు అడ్జస్టు కావాలి.. కాంప్రమైజ్ అవ్వాలి.. కలిసి నడవాలి.. ఇదీ కేసీఆర్ ఆలోచన. ఆయన ఆలోచనరల మేరకే ఈ ప్రణాళికలు, ఎత్తుగడలు, వ్యూహాలు. ఇక ముఖ్యమంత్రిని చేయడమే మిగిలి ఉంది ఇదే తరహా వ్యూహంతో. యాదాద్రి ప్రారంభోత్సవం తర్వాత దానికీ ముహూర్తం పెడతాడు కేసీఆర్.