చాలా రోజుల తర్వాత అర్వింద్ మళ్లా నోరు తెరిచాడు. దళితుల చుట్టూ తిరిగిందీ ఈ ప్రెస్మీట్. అంతా రక్త కన్నీరే. అంతటి ఘోరమైన పదజాలం వాడాడు. ఇదేమీ కొత్తకాదంటారా? కాదుకానీ.. హుజురాబాద్ కోసమా.. ? బీజేపీని స్ట్రాటజిగ్గా లేపడమా తెలియదు కానీ… ఇష్టమొచ్చినట్టు తిట్టిపోశాడు.
కేసీఆర్ నుంచి మొదలుకొని కేటీఆర్, కవిత… హరీశ్ ఎవరినీ వదల్లేదు. అసలు దళితబంధు అమలు సాధ్యమే కాదని లెక్కలతో సహా చెప్పే ప్రయత్నంతో మొదలుపెట్టిన ప్రెస్మీట్.. గాడితప్పి.. వేడిగా మారి, మాటల పదును పెరిగి.. కోటలు దాటి.. బూతుల దాకా పోయి.. బండబూతులకు కూడా దిగజారి…అలా అలా కొనసాగింది. కేటీఆర్ను అరే బేవకూఫ్..మత్తు పదార్తాలకు అలవాటు పడ్డ బానిస అని .. నాలుక మడతపెట్టేశాడు అర్వింద్. మూడు పార్టీలు నాకే ఓటేశాయి..అందుకే గెలిచానని కేటీఆర్కు కౌంటర్ ఇస్తూనే… మళ్లీ కవితను పోటీకి తనపై పోటీకి దించాలని సవాల్ విసిరాడు. మీ ఎమ్మెల్యేలే కవితను ఓడగొట్టారని కూడా అనేశాడు షరా మామూలుగా.
హుజురాబాద్ రెఫరెండం అని హరీశ్ అంటున్నాడు… మరి ఓడిపోతే రాష్ట్రపతి పాలన పెడతారా? అని ఎదురుప్రశ్నించాడు. దళితులను సీఎం చేస్తానని చెప్పి మోసం చేశాడన్నాడు. డిప్యూటీ సీఎంలుగా ఉన్న రాజయ్యను, కడియం శ్రీహరిలను మోసం చేశాడన్నాడు. దళితులు మంత్రి వర్గంలో ఎంత మంది ఉన్నారని నిలదీశాడు. తెలంగాణ డిపార్ట్మెంట్ సీనియర్ మోస్ట్ ఆఫీసరే దళిత బంధు అమలు అసాధ్యమని చెప్పాడని బాంబు పేల్చాడు.
దళితబంధును రాజకీయ లబ్డికోసమే ప్రవేశపెట్టామని ఒప్పుకున్న కేసీఆర్.. తర్వాత మాటమార్చి ఓట్లకు దీనికి లింకు ఎలా పెడతారని మాట్లాడుతున్నాడని వీడియోలు ప్లే చేసి మరీ చూపి విమర్శలకు దిగాడు. పనిలో పని రేవంత్ను ఓ ఆట ఆడుకున్నాడు. దమ్ముంటే దళితుడిని సీఎం చేస్తామని ప్రకటింపజేస్తావా? అని సవాల్ విసిరాడు. అంటే దళితులను సీఎం చేయడం మేమే కాదు.. మీరు, టీఆరెస్.. ఎవరికీ సాధ్యం కాదు.. ఇష్టం ఉండదు. అది కానీ పని అనే విధంగానే సమర్థించుకనే విధంగానే మాట్లాడుతూ.. ఆత్మసంరక్షణలో పడేశానని అనుకున్నాడు. బీసీల సభకలకు కూడా రెడ్లు పోవడమేందీ.. అని రేవంత్ పై విరుచుకుపడ్డాడు. ఎంతో మంది బీసీల రాజకీయ జీవితాలను నాశనం చేశారని విరుచుకుపడ్డాడు. డీఎస్ కూడా అందులో ఉన్నాడనే భావం వచ్చేలా.
ఈటల గెలిస్తే కేటీఆర్కు బుద్దొస్తది.. కేసీఆర్కు సోయొస్తది.. తుపాల్ తుపాల్ ప్రామిస్లు సీఎంవి.. అని తన మార్కు డైలాగులతో భారీ ప్రెస్మీట్లో రక్తకన్నీరు సినిమా చూపించాడు అర్వింద్.
కేటీఆర్ అసమర్థుడని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. అందుకే హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిందన్నాడు. మొత్తానికి మీడియా అడుగుతూనే ఉంది.. అర్వింద్ కమ్మని భాషలో తనదైన శైలిలో మంచిగా అందంగా ముద్దుగా .. వినయంగా సమాధానాలిస్తూ పోతూనే ఉన్నాడు.
ఇప్పుడు ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేఖ్నే కా హై…
కౌన్.. ఆతా హై పత్తర్ లేఖే…. వెయిట్ అండ్ సీ