వినాయకచవితికి ఐదో రోజున లక్ష్మీ పూజలు చేయడం కొన్ని చోట్ల ఆనవాయితీ. మహారాష్ట్ర నుంచి ఈ కల్చర్ వచ్చింది. నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ సంస్కృతి బాగా ఉంది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిర పడ్డ వారు నిష్టగా లక్ష్మీ పూజలు చేస్తారు. లక్ష్మీదేవీ కటాక్షించి ధనప్రాప్తి కలిగజేయాలని ఈ పూజలు చేస్తుంటారు. రెండు లక్ష్మీ దేవత విగ్రహాలకు చీరతో కట్టి అలంకరిస్తారు. అన్ని రకాల పిండివంటలు చేస్తారు. లక్ష్మీదేవీకి ఇద్దరు సంతానం. ఓ కొడుకు, ఓ కూతరు. వీరిని కూడా పక్కనే ప్రతిష్టించి… ముస్తాబు చేస్తారు. కొందరు ఇరుగుపొరుగును పిలిచి .. పసుపు కుంకుమలు కూడా ఇస్తారు. ఇంకొందరు భోజనాలు పెడతారు. వినాయకచవితి ఐదో రోజున ఈ పూజలు చేసి.. తర్వాత రోజు సాయంత్రం వరకు తీసేస్తారు. ఇలా ప్రతీ ఏడాది లక్ష్మీపూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. మహారాష్ట్ర నుంచి వచ్చి స్థిరపడినవారే కాకుండా కొంతమంది ఇక్కడి వాళ్లు కూడా ఈ పూజలను ఈరోజు చేస్తారు.
Related Post
ఆత్మగౌరవం అప్పుడు ఎర్రవల్లికి.. ఇప్పుడు ఢిల్లీకి! కేబినెట్ మీటింగులపై కవిత చురకులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.. రేవంత్ రెడ్డి మాటిచ్చాడు మరిచాడు..! తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ 24న చలో సెక్రటేరియట్కు జాగృతి మద్దతు
Feb 19, 2026
Dandugula Srinivas
