దళితబంధు దేశానికే ఆదర్శం కావాలె. ప్రపంచం ఆచరించాలె. అంటు కేసీఆర్ దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. రాజకీయ లబ్దిని ఆశిస్తున్నాడు. అందుకే హుజురాబాద్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టేందుకు రేపు అక్కడి దళిత నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నాడు. ఒకరోజు వారితో గడపపనున్నాడు. హుజురాబాద్లో దళితుల ఓట్లే అధికం. ఈ సమయంలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం .. అదీ హుజురాబాద్లోనే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయడం రాజకీయ విమర్శలకు దారి తీసింది. అయినా దీన్ని కేసీఆర్ సమర్థించుకున్నాడు. కచ్చితంగా రాజకీయంగా మేం లబ్ది పొందుతాం. దాంట్లో అనుమానం లేదు. మాది ఫక్తు రాజకీయ పార్టీ కదా. అని చెప్పుకొచ్చాడు. దీనిపైనా దుమారం రేగింది. కేసీఆర్ అంటే అంతే మరి. ఎవరేమనుకున్నా.. తాను అనుకున్నది చేస్తడు. తన విజన్ తనకుంటుంది. ఎవరి గురించీ పట్టించుకోడు. కానీ మనసులో మాత్రం విపరీత భయం ఉంటుంది. దాన్ని కవర్ చేసుకునేందుకు ఇలా ఈటల బచ్చా… వాడితో వచ్చేది లేదు. సచ్చేది లేదని మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు.
ఇదంతా ఇలా ఉంటే. సరిగ్గా సమయాకినే ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వ్యవహారం కేసీఆర్కు గుదిబండలా మారింది. దళితబంధు ప్రకటించిన తర్వాతే ఆయన వీఆర్ఎస్ పెట్టుకోవడంతో ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు చక్కర్లు కొట్టారు. కాలం గడిచే కొద్దీ ఒక్కొక్కదానికి సమాధానం దొరకుతూ వస్తున్నది. అనుమానపు తెరలు తొలిగిపోతున్నారు. అణగదొక్కబడ్డ ఆవేదనంతా మెల్లగా వెళ్లగక్కుతున్నాడు ప్రవీణ్. దళితబంధు పథకం శుద్ధవేస్ట్గా అభివర్ణించాడు. దానికి బదులు దళిత విద్యాబంధు పెట్టమని అన్నాడు. దళిత ఐఏఎస్ ఆఫీసర్లు ఘోరంగా అవమానింపబడుతున్నారని భగ్గుమన్నాడు. కేసీఆర్ పై పరోక్షంగా విరుచుకుపడ్డాడు. దొరహంకారం చూపించాడనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నా బంగారు తెలంగాణ అంటున్నారని విమర్శించాడు. ఇపుడు ప్రవీణ్ వ్యవహారం కేసీఆర్కు కొరకరాని కొయ్యలా తయారయ్యింది. దళితబంధును ఇంత ఆర్బాటంగా ప్రవేశపెడితే.. రావాల్సిన మైలేజీ, రాజకీయ లబ్ది దొరకడం కష్టంగానే కనిపిస్తున్నది. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను దళితులు దళితులు దేవుడిలా భావిస్తారు. అమితంగా గౌరవిస్తారు. అలాంటి అతన్నుంచి దళితబంధుకు కనీస రెస్పెక్ట్ కూడా దొరకకపోవడం కేసీఆర్ను ఇరుకున పెట్టే అంశంగా మారింది. ఈ పరిణామం కచ్చితంగా హుజురాబాద్ ఉప ఎన్నికపై పడనుంది. దళితుల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టాలనే కేసీఆర్ వ్యూహానికి ప్రవీణ్కుమార్ గండి కొడ్తున్నాడంలో సందేహం లేదు.
ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళిపై ప్రభుత్వం పెంచుకున్న ద్వేషాన్ని, అవమానించిన తీరును బటయపెట్టాడు. తనకూ ఆ గతి పట్టదని నమ్మకం ఏంటని ప్రశ్నించాడు. అంటే ప్రభుత్వం దళితులందరి పట్ల ఇదే వైఖరితో ఉందని, వివక్ష చూపుతుందని కుండబద్దలు కొట్టాడు ప్రవీణ్కుమార్.
