కేసీఆర్ అప్పుడే మ‌హాధ‌ర్నాకు దిగితే.. కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాలు అప్పుడే ర‌ద్ద‌య్యేవి..? ద‌టీజ్ కేసీఆర్‌…

 

కేసీఆర్ అన‌వ‌స‌రంగా ఆల‌స్యం చేశాడు. ఎంత మంచి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను అష్ట‌వంక‌ర‌లు తిరిగి యూ టర్న్‌లు తీసుకోకుండా ఉండి ఉంటే.. మొద‌ట్లో చేసిన పోరాటం అలాగే కంటిన్యూ చేస్తే.. ఉత్త‌ర భార‌త దేశ రైతులతో జ‌త‌క‌ట్టి ఇక్క‌డా రైతు ఉద్య‌మాలు నిర్మించి ఉంటే.. నిన్న‌టి మ‌హాధ‌ర్నాలో ధ‌ర్నా చౌక్ వ‌ద్ద వారినికో సారి వ‌చ్చి ఖ‌బ‌డ్డార్ మోదీ.. కాస్కో.. చివ‌రి ర‌క్త‌పు బొట్టు వ‌ర‌కు పోరాడుతా.. మెడ‌లు వంచుతా.. నీకు ఇంగిత జ్ఞాతం లేదు… అని తిట్ల దండ‌కం అందుకుని ఉంటే..

ఈరోజు న‌ల్ల చ‌ట్టాలు అమ‌లు ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న మోడీ .. కేసీఆర్ ఉద్య‌మాల‌కే భ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గాడ‌ని ఎంత మంచి పేరు వ‌స్తుండే. ఛ‌.. ఛ‌.. ఛాన్స్ మిస్స‌య్యిందే. కానీ టీఆరెస్ నాయ‌కులకు దీన్ని వదులుకోవ‌డం ఇష్టం లేదు. అందుకే నిరంజ‌న్ రెడ్డి అంటున్నాడు…. కేసీఆర్ గురించి మోడీ కి తెలుసు. అందుకే భ‌య‌ప‌డ్డాడు. ఉద్య‌మం ఉధృత రూపం దాల్చ‌క‌ముందే వెన‌క్కి త‌గ్గాడు..అన్నాడు. అంతా మా కేసీఆర్ ఉద్య‌మ ఉగ్ర‌రూప‌మే అన్న‌ట్టుగా అన్నాడు. మేమూ అదే అంటున్నాం నిరంజ‌న్‌రెడ్డీ….. మీ సారు అప్ప‌ట్నుంచే ఇది ఇలాగే చేసుంటే.. ఇంత మంది రైతులు చ‌చ్చిపోయేవాళ్లు కాదు క‌దా. అప్ప‌డు మ‌న‌సారు ప్ర‌యోజ‌నాలు ముడిప‌డి ఉన్నాయి. సారు ప్ర‌యోనాలంటే మీ దృష్టిలో.. అంద‌రి దృష్టిలో తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌న్న‌ట్టు. అన్న‌ట్టేంది.. అంతా అనుకోవాల‌ని మీ ఆకాంక్ష‌. అలాగే అనుకుంటున్నాం కూడా. పెద్ద నోట్ల ర‌ద్దు పిచ్చి ఆలోచ‌న అంటే.. ఔ ఔ అంటాం. కాదు కాదు బాగు బాగు అంటే.. శ‌బ్బాష్ కేసీఆర్ అంటాం. జీఎస్టీ అంటే సార్ ఏమంటాడో చూస్తాం. సార్ ఎస్ అంటే మంచిదే అని .. నో అంటే మోడీ వేస్ట్ అని అనుకుంటాం. ఇలా సారుకు పైన ఉన్న సంబంధాలు, మూడ్‌, రాజ‌కీయ అవ‌స‌రాలు, ప‌ద‌వులు, పైస‌లు, పెద్ద‌నోట్ల మార్పిడి.. ఇంకా ఏమైనా అవ‌స‌రాలుంటే అవ‌న్నీ తీరితే ఓకే. లేదంటే మోడీ వేస్ట్‌… కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌లం అని అంటాం. మా సారు.. అదే మీ సారు ఎలాగంటే అలాగే.

కానీ ఒక్క‌టి మాత్రం నిజ‌మే అనిపిస్తుంది.

అవ‌స‌ర‌మైతే తానే భార‌త రైతు ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హిస్తా అన్నాడు చూడు… అక్క‌డ వ‌ణికిపోయాడు మోడీ గ‌జ‌గ‌జా.. అమిత్ షా కూడా క‌రెంటు కొట్టిన కాకిలో న‌ల్ల‌గా మాడిపోయి.. గిల‌గిలా కొట్టుకున్నాడు.

మొత్తానికి యాసంగి రైస్ కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని అత‌లాకుత‌లం చేస్తుంటే.. దాన్ని మోడీ మెడ‌కు పెట్టి ఇక్క‌డ రైతుల‌ను ఉసిగొల్పుదామ‌ని కేసీఆర్ అనుకున్నాడు. కానీ మోడీ.. భార‌త రైతుల బాధ‌లు తీర్చే న‌ల్ల చ‌ట్టాల‌ను తెల్లారే ర‌ద్దు చేసుకుని మా కేసీఆర్‌ను జాతీయ స్థాయి నాయ‌కుడ్ని చేసేశాడు. ఇదే టెంపోతో ఇదే వేగంతో దూసుకుపో కేసీఆర్. మీ నాయ‌కులన్న‌ట్టు మీకు ఇక్క‌డ ప‌నిలేదు. భార‌త దేశానికి నీ అవ‌స‌రం చాలా ఉంది. యువ‌రాజుకు ప‌ట్టం గ‌ట్టి వెళ్లిపో. ఇప్ప‌టిదాకా నీతో వేగాం.. ఇప్పుడు యువ‌రాజును త‌ట్టుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు..