(దండుగుల శ్రీ‌నివాస్‌)

రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోవ‌డానికి, హెచ్‌సీయూ భూముల‌కు లింకు పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేష‌న్ ప్రారంభించిన త‌రువాత ఆయ‌న మాట్లాడిన మాట‌లు మ‌ళ్లీ వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి. హైడ్రా వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం ప‌డిపోయింద‌ని బీఆరెస్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఇలా స్పందించాడు. స‌రే నా వ‌ల్ల‌నే రియ‌ల్ ఎస్టేట్ రంగం ప‌డిపోయింద‌నుకుందాం.. నేనే దాన్ని లేపాల‌ని హెచ్‌సీయూ ప‌రిధిలోని 400 ఎక‌రాల్లో ఐటీ ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయిద్దామ‌నుకున్నా… కానీ మీరు పాముల‌న్నాయి. చెట్లు చేమ‌లున్నాయ‌ని అడ్డుకున్నారు. ఇగ నేనేం చేసేది.. అన్నాడు సీఎం.

ఇంత జ‌రిగినా, సుప్రీం మొట్టికాయ‌లు వేసినా రేవంత్ వైఖ‌రిలో మార్పు రాలేదు. ఆభూములు వ‌ద్ద‌న్న‌ది అక్క‌డి వాతావ‌ర‌ణం, నేప‌థ్యం వ‌ల్లే. వేరే చోట్ల భూములు లేవా అమ్ముకోవడానికి. పుప్పాల‌గూడ‌, గోప‌న్‌ప‌ల్లిల‌లో ఇప్పుడు చేస్తున్న‌ద‌దే క‌దా. రేవంత్ చెప్పిన ఈ లింకు ఏమాత్రం స‌మంజ‌సం లేక‌పోగా.. మ‌ళ్లీ గ‌చ్చిబౌలి భూముల విష‌యం తీసుకురావ‌డం మ‌రింత అభాసుపాలుకావ‌డ‌మే త‌ప్ప ఏమాత్రం ఉప‌యోగం లేని విష‌య‌మే. చివ‌ర‌గా హైడ్రా వ‌ల్ల అప్ప‌టికే అంతంత మాత్రంగా ఉన్న రియ‌ల్ పూర్తిగా ప‌డిపోయింద‌నేది వాస్త‌వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed