(దండుగుల శ్రీ‌నివాస్‌)

క‌విత మాట అక్క‌డ చెల్లుబాటు కాదు. ఆమె ఉనికి చాటుకునే ఆరాట‌మే త‌ప్ప .. అది బీసీల పోరాట‌మే. ఒక‌వేళ ఆమెను బీసీలు న‌మ్మి వెనుక న‌డిస్తే మాత్రం కుక్క‌తోక ప‌ట్టుకుని గోదారి ఈదిన‌ట్టేన‌న్న విధంగా వీ6 ఇంట‌ర్వ్యూ సాగింది. జైలుకు వెళ్లి వ‌చ్చిన త‌రువాత ఆమె తొలిసారిగా ఈ చానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. వెంక‌ట్ ఇంట‌ర్వ్యూ తీసుకున్నాడు. చాలా ప్ర‌శ్న‌లు సూటిగా సాగాయి. కొంత త‌డ‌బ‌డినా.. బీసీల అంశంపై గుచ్చి గుచ్చి అడిగి జ‌నాల‌కు అస‌లు వాస్త‌వాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. క‌విత చాలా ఇబ్బంది ప‌డింది. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి. అబ‌ద్దాలు చెప్పింది. ఆత్మ ర‌క్ష‌ణ స‌మాధానాలు వ‌చ్చాయి. అంతిమంగా ఈ ఇంట‌ర్వ్యూ మూలంగా ఆమెకు మైలేజీ రాలేదు. లోపాలెత్తి చూపి ఆమె వ‌ల్ల ఏమీ కాద‌ని, గ‌తంలో కాలేద‌నే విష‌యాన్ని చెప్పించే ప్ర‌య‌త్నం చేసింది వీ6. వాస్త‌వానికి ఆమె పార్టీలో ఒంట‌రి. కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేదు. కేటీఆర్ త‌న పంథా తాను చూసుకుంటున్నాడు.

క‌విత మాత్రం బీసీల నినాద‌మందుకున్న‌ది. ఓ సంద‌ర్భంలో ఆమే ఇంట‌ర్వ్యూలో పేర్కొన్న‌ది. ఏమ‌ని. కేటీఆర్‌, హ‌రీశ్‌రావులు యాక్టివ్ అయితే అడ‌గ‌రు గానీ నేన‌యితేనే మీకు బాధ‌నా అని. ఈ స‌మాధాన‌మే ప‌ట్టిస్తోంది. ఆమె వారికి పోటీగా త‌నకంటూ సొంత పోరాటాన్ని నిర్మించుకునే ప‌నిలో ఉంద‌ని. కానీ బీసీలు గ్ర‌హించాలి. ఆమెతో తిరుగ‌తున్న వారికి ఒక్క కౌన్సిల‌ర్‌, ఒక కార్పొరేట‌ర్‌, ఒక ఎమ్మెల్యే టికెట్ ఆమె ఇప్పించుకోగ‌లుగుత‌దా అని. అసాధ్యం. ఎందుకంటే ఆమె సొంత గడ్డ నిజామాబాద్‌లోనే ఆమె బీసీల‌ను విస్మ‌రించింది. అక్క‌డ సిట్టింగు ఎమ్మెల్యేలు ఏది చెబితే అదే వేదం. న‌మ‌స్తే తెలంగాణ బ్యూరో చీఫ్‌గా ఓ ఎంబీసీ ఉంటే.. త‌న కులం వాడిని తెచ్చిపెట్టుకున్న చ‌రిత్ర క‌విత‌ది. ఆమెను బీసీలు ఎలా న‌మ్ముతారు. గ‌త్యంత‌రం లేక‌. వేరేదారిలేక‌. స‌రే ఎవ‌రి క‌ష్టాలు వారివి. ఆమెను లిక్క‌ర్ రాణీగా సోష‌ల్ మీడియ‌లో అంటున్నార‌ని యాంక‌ర్ అడిగాడు. ఇది మ‌రీ టూ మ‌చ్‌. ఓ లేడీని ప‌ట్టుకుని అలా అడ‌గాల్సింది కాదు.

ఇరుకున పెట్టే ప్ర‌శ్న‌లు ఇంకా చాలా ఉన్నాయి. బాడీ షేమింగ్ లాంటి ప్ర‌శ్న‌ల‌ను ఆశ్ర‌యించ‌డం ఆ యాంక‌ర్ అవ‌గాహ‌న లేమి. అత్యుత్సాహం. ప్ర‌శ్న‌లు చాలా వ‌ర‌కు హుందాగా లేవు. స‌రే ఆ మాట‌టుంచితే…. ఈ ప్ర‌శ్న‌ల‌కు క‌విత చెప్పిన స‌మాధానం శుద్ద తప్పు. సోష‌ల్ మీడియాను త‌ను ఫాలో కావడం లేదంట‌. ఆమె మెయిన్ స్ట్రీమ్ మీడియాను వ‌దిలేసింది. అంద‌రిలాగానే. క‌విత పింక్ బుక్కు గురించి వాస్త‌వంలో ఓ వార్త రాస్తే… త‌న పీఏల‌తో ఇష్ట‌మొచ్చిన‌ట్టుగా తిట్టించింది. అది ఆమెకు తెలియ‌కుండా జ‌ర‌గ‌లేదు. కేసీఆర్ ఫామ్ హౌజ్ వ‌దిలి రాడ‌ని చెప్పే ప్ర‌య‌త్నం ఆమెను మ‌రింత మైన‌స్ చేసింది.

కేసీఆర్ జ‌నాల‌ను క‌ల‌వ‌క‌పోవ‌డం స్ట్రాట‌జీ అన్న‌ది. అదే స్ట్రాట‌జీ క‌విత కూడా అప్పుడు పాటించింది. ఇప్పుడు 24 గంట‌లు గేట్లు తెరుచుకుని జ‌నాల‌కు టైమ్ ఇస్తున్నా అన్న‌ది. కానీ వ‌చ్చే జ‌నాలేరీ..? అంతా నాయ‌కులే. పార్టీ వ‌ల్ల ఏదైనా లాభం జ‌రుగ‌త‌ద‌ని కోరుకునే, ఆల్ట‌ర్నేట్ లేని నాయ‌కులే. మీరు మార‌ర‌నే విష‌యం అర్థ‌మ‌య్యింది. ఇంట‌ర్వ్యూ చూసిన జ‌నాల‌కు మ‌రోసారి.

You missed