నిజామాబాద్:

“నిజామాబాద్ సభలో కేసిఆర్ గారిపై పై ప్రధాని మోడీ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడడం అత్యంత హేయనీయం. కేసిఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పడం పచ్చి అబద్దం. ఎన్డీయే లో కలవమని మీరు బ్రతిమిలాడితే దేశాన్ని అమ్మే వారితో కలవమని కేసిఆర్ ఖరాఖండిగా చెప్పారు. కేసిఆర్ పై ఎన్నికల వేళ అవినీతి ఆరోపణలు చేస్తున్న నీవు ఇన్ని రోజులు ఏం చేశావు. దర్యాప్తు సంస్థలన్నీ నీ జేబులోనే ఉన్నాయి కదా..?. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన ప్రధాని నరేంద్ర మోడీ కేసిఆర్ గారిపై ఆరోపణలు చేయడం విడ్డూరం. అదానికి బినామీ మోడీ. దేశ సంపదను తన మిత్రుడు అధానికి దోచి పెడుతున్నడు మోడీ. హిండెన్ బర్గ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు మోడీ అవినీతి చిట్టా బయటపెట్టాయి. తన మిత్ర కార్పొరేట్లకు 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేసి, ఆ అక్రమ డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తెలంగాణ అంటేనే నరనరాన విషం నింపుకున్న మోడీ తెలంగాణ కోసం చేసింది శూన్యం. బయ్యారం ఉక్కు కర్మాగారం,రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,మెడికల్ కాలేజీలు,నవోదయ పాఠశాలలు,ఐటిఐఆర్,ఐఐటి లు ఒక్కటి కూడా తెలంగాణ కు ఇవ్వలేదు. తెలంగాణ అభివృద్ది బద్ద వ్యతిరేకి మోడీ.

కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలంటే నీ సహాయం ఎందుకు..? నీవు ఎవడివి కౌన్ కిస్కాగాడివి నీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత.? నీ బలమెంత.? వందమంది ఎమ్మేల్యేలు బలం ఉన్నది మాకు. కేసిఆర్ గారు అనుకుంటే ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో, కెటిఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయొచ్చు. ఇందులో నీ బోడి సహాయం ఎవడికి కావాలి.”

– వేముల ప్రశాంత్ రెడ్డి
రాష్ట్ర రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి

You missed