ముంబై ఎయిర్‌పోర్టు పేరును మార్చడాన్ని శివసేన గట్టిగా వ్యతిరేకించింది. అదానీ ఆగడాలు ముంబైలో నడవవని గట్టిగా హెచ్చరించింది. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన అదానీ బోర్డుల‌ను శివ‌సేన కార్య‌క‌ర్త‌లు ఈరోజు ధ్వంసం చేసి వాటిని తొల‌గించారు. చ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ ఎయిర్‌పోర్టు పేరును మార్చే హ‌క్కు అదానీ గ్రూప్‌కు లేద‌ని శివ‌సేన మరోసారి స్ప‌ష్టం చేసింది.
ఈ ఏడాది జులై 13న ముంబై ఎయిర్‌పోర్టు నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను ఇటీవల గౌతం అదానీ గ్రూప్ చేప‌ట్టింది. అంతకుముందు ఎయిర్ పోర్టును జీవీకే గ్రూప్ నిర్వ‌హించింది. కానీ అప్పుడు జీవీకే ఎయిర్ పోర్టు పేరు జోలికి పోలేదు. కానీ అదానీ గ్రూప్ మాత్రం ఎయిర్ పోర్ట్ బాధ్యతలు చేపట్టగానే.. ఎయిర్‌పోర్ట్ ప్రాంగ‌ణంలో అదానీ ఎయిర్‌పోర్ట్ పేరిట బోర్డులను ఏర్పాటు చేయడం వివాదాలకు కారణమైంది.

C Karunakar Reddy

You missed