నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చారిత్ర‌త్మాక, పురాత‌న దేవాల‌య‌మైన నీల‌కంఠేశ్వ‌ర ఆల‌య భూములు పూర్తిగా అక్ర‌మార్కుల చేతుల్లోకి వెళ్లాయ‌ని బీజేవైఎం ఆందోళ‌న చేప‌ట్టింది. స్టేట్ సెక్రెట‌రీ ప‌టేల్ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. అన్యాక్రాంతంలో ఉన్న దేవాల‌యాల స్థ‌లాల‌ను త‌క్ష‌ణ‌మే స్వాధీనం చేసుకోవాల‌ని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ ప్ర‌మేయం కూడా ఈ క‌బ్జాల‌లో ఉంద‌ని ఆరోపించారు. ఇందూరు న‌గ‌రంలోని మొత్తం ఆల‌య ఆస్తులు, వాటి ఆదాయ వివ‌రాల మీద శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

You missed