నాయకుల రాకను స్వాగతిస్తూ దాడి పొడవునా ఎర్రటి ఎండలో దండాలు పెడుతూ గంటల తరబడి వేచిచూసే సంస్కృతి తెలంగాణ వచ్చిన తరువాత ఎక్కువైంది. దొరస్వామ్య పాలన అవశేషాలో, అధికార దర్పమో కానీ ఇలా దండాలు పెడుతూ స్వాగతించడాన్ని మన నాయకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పైగా ఇది మాకు ధన్యవాదాలు తెలిపే చర్య అని, అభిమానంతో నిలబడుతున్నారని సమర్ధించుకుంటున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏకంగా దాడి పొడవునా నిలిచిన మహిళల ఫోటో తన ఫేస్బుక్లో ఫోస్ట్ చేసుకుని సంతోష పడ్డాడు. దీనిపై దుమారం రేగింది. విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఓ కాంగ్రెస్ నాయకుడు దీనిపై ఎన్హెచ్ఆర్సీకీ ఫిర్యాదు చేశాడు. ఉద్యోగినులను ఎండలో నిలబెట్టాడని పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ స్వీకరించింది. కేటీఆర్, సంతోష్ల పై విచారణకు రెడీ అయ్యింది.
Related Post
సస్పెన్స్ థ్రిల్లర్…! అన్ని పార్టీల మేకపోతు గాంభీర్యం.. !! పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ… నీకెన్ని..? నాకెన్ని…?? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో టెన్షన్.. టెన్షన్.. సైలెంట్ ఓటు ఎవరి కొంపముంచుతుందో తెలియని ఆందోళన.. బీజేపీ-10, కాంగ్రెస్ – 6, ఎంఎఐం-1 ఇవే ఫలితాలు వస్తాయంటున్న మెజార్టీ జనం.. తగ్గేదేలే అంటున్న అన్ని పార్టీలు.. చివరకు బీఆరెస్ కూడా పెద్ద లెక్కలే చెబుతున్న వైనం. గతంలో ఇలాంటి ఉత్కంఠ పరిస్థితులు ఎన్నడూ లేవు.. ఈసారే ఇలా…
May 17, 2024
Dandugula Srinivas
అక్కను ఇగ ఇప్పట్ల రానీయ్యరు..! బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు విఫలం.. !! ఎంపీ ఎన్నికల వేళ కవిత ఊసే లేకుండా ఇందూరు రాజకీయాలు.. ఆ పార్టీకి సానుభూతి కూడా రాని వైచిత్రి.. ప్రచారంలో ఆ నేతలు ఎక్కడా కవితకు అన్యాయం జరిగిందనే ఊసు లేకండానే ముందుకు.. రాజకీయంగా కవిత మరింత దూరం.. ఇందూరుకు మరింత దూరం దూరం..!!
May 7, 2024
Dandugula Srinivas