(దండుగుల శ్రీనివాస్)
ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా అన్ని పేపర్లకు యాడ్స్ కుమ్మరేంచేస్తుంది. సీఎం తను బడ్జెట్ పద్మనాభం అని చెప్పుకుంటాడు. కానీ పేపర్లకు మాత్రం కోట్లకు కోట్లకు యాడ్స్ వచ్చేస్తున్నాయి. సర్కార్ చేపట్టే ఏ కార్యక్రమమైనా అది ఆనవాయితీగా మారింది. గతంలో పరిస్థితీ ఇప్పుడూ రిపీట్ అవుతోంది. ఇప్పుడివన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. ఇయ్యాల్టి నుంచి హైదరాబాద్లో అందాల పోటీలు షూరువయ్యాయి. అక్కడ జమ్ములో ఉద్రిక్త పరిస్తితులు. ఇదేందిక్కడ.. సర్కార్ ఇట్లా చేస్తుంది. వెంటనే వీటిని ఆపాలి అనే నినాదాలు పెరిగాయి. కానీ అంతకు ముందు నుంచే ఈపోటీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఇజ్జత్ కా సవాల్గా తీసుకున్నది.
కానీ ఈ సమయంలో మొండిపట్టు పట్టి మరీ వీటిని నిర్వహించేందుకు సర్కార్ ముందడుగే వేయడం మాత్రం బద్నాం తెచ్చి పెట్టే చర్యే అని చెప్పాలి. సరే తప్పడం లేదు చేస్తున్నారేమో. ప్రతిపక్షానికి ఇదో అస్త్రమయ్యింది. అప్పుడు ఈ కార్ రేసింగ్ కూడా ఆదాయం, పేరు , హైదరాబాద్ బ్రాండ్ కోసమే చేశామని చెప్పుకొచ్చిన కేటీఆర్.. ఇప్పుడు అక్కడ యుద్ద వాతావరణం ఉంటే ఇక్కడ అందాల పోటీలా అని నిలదీస్తున్నాడు. సరే ఇదంతా పక్కన పెడితే .. ఇవాళ పేపర్లకు యాడ్స్ మాత్రం రాకపోవడం పెద్ద రిలీఫ్గా అనిపించింది.
రేవంత్కు ఎవరు సలహాలిస్తున్నారో..? ఆయన ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అదంతా వ్యూహం అంటున్నారు కొందరు. మరీ ఇంత దిగజారే వ్యూహం అప్రతిష్టను తెచ్చిపెట్టేదే. అందాల పోటీల యాడ్స్ ఇవ్వక సర్కార్ మంచి పనే చేసింది. పోటీలు నిర్వహించి మాత్రం అపవాదే మూటగట్టుకుంది. అదే ఈ పోటీలను వాయిదా వేస్తున్నామని ఒక్క మాట చెప్పి ఉంటే అది వేరే ఉంటుండే.