మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు..
భారత్ దాడుల నుంచి పాకిస్తాన్ను అల్లానే రక్షించాలి…పాక్ ప్రధానమంత్రి చేతులెత్తేసి పారిపోతున్నారు… మోడీ దెబ్బకు వెన్నుచూపుతున్నారు. పాకిస్తాన్ అంతటా భారత్ డ్రోన్ల దాడి జరుగుతూనే ఉంది. పాక్లో పరిస్థితి ఏమాత్రం బాగలేదు. ఇదంటున్నది భారత్ కాదు.. పాకిస్తాన్ నాయకులు, అక్కడి ప్రజలు. అల్లా దిగివస్తాడో లేదో తెలియదు కానీ, కనీసం ఇమ్రాన్ఖాన్ జైలు నుంచి విడుదలైతే కొంతలో కొంత ధైర్యం వస్తుందని ప్రజలంటున్నారు. పాక్ లెక్క చూస్తే.. అక్కడి మాటలు చూస్తే వార్ వన్సైడే అనిపిస్తున్నది.
తెహల్గాం మారణహోమానికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరిట యుద్దం మొదలుపెట్టిన భారతదేశం వార్ వన్సైడ్ అన్నట్గుగా దూసుకుపోతున్నది. పాకిస్తాన్ ఎదురుదాడిని తిప్పికొట్టడానికి శరపరంపరగా మిస్సైళ్లను ప్రయోగిస్తూ పాకిస్తాన్ గుండెల్లో దడ పుట్టిస్తున్నది. భారత్ సైన్యం ధీటుగా చేస్తున్న దాడి ప్రకంపనలు సృష్టిస్తన్నాయి. తమ ఉనికిని చాటుకోవడానికి అక్కడక్కడ సరిహద్దు ప్రాంతాల పై పౌర నివాసాలపై దాడులు చేస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ సైన్యం చాలా చోట్ల చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. ఒకవైపు బలిచుస్తాన్ స్వాతంత్రం కోసం చేస్తున్న దాడులకు వెన్నుచూపుతున్న పాక్ సైన్యం.. మరోవైపు భారత్ నుంచి జరుగుతున్న ముప్పేట దాడికి ముప్పుతిప్పలు పడుతోంది. వార్ వన్సైడ్ కొనసాగుతుందా..? అని భారతదేశం చెప్పుకుంటే దాంట్లో వార్తలేదు. అది వార్తకాదు. కానీ, భారత్ నలువైపులా చేస్తున్న దాడిని పాక్ సైన్యం తిప్పికొట్టలేకపోతున్నదని, అదే దేశానికి చెందిన నాయకులు, మాజీ మిలటరీ అధికారులు పార్లమెంటు సాక్షిగా బహిరంగ సభల సాక్షిగా గగ్గోలు పెడుతుండటం విచిత్రం. విశేషం. భారత్ దాడి నుంచి అల్లానే రక్షించాలని ఒక మాజీ సైనికాధికారి రోధిస్తుంటే.. ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు ప్రధాన మంత్రి, మిలటరీ అధికారులు పారిపోతున్నారని పార్లమెంటు సాక్షిగా తీవ్రంగా ధ్వజమెత్తుతుండటం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడవేసింది.
భారత్ దాడిని ఎదుర్కోలేకపోతున్నాం. ఈ ముస్లింలకు అల్లానే రక్షించాలని తావీర్ ఇక్బాల్ అనే మాజీ సైనికాధికారి పెద్దల సభలో రోధించిన దృశ్యాలు శత్రువులను సైతం కలిచివేస్తున్నాయి. మరో పార్లమెంటు సభ్యుడు, పాక్ ప్రధానిని తీవ్రంగా దుయ్యబట్టాడు. భారత్ దాడులకు ప్రధాన మంత్రి వెన్ను చూపుతున్నారని, ఆయన పిరికిపందలా వ్యవహరిస్తూ పాక్ సైనిక మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఒంటికాలిపై లేచి తీవ్రంగా ధ్వజమెత్తారు. మరో పార్లమెంటు సభ్యుడు భారత్ ప్రధాని తూటాలను విడుస్తుంటే .. పాక్ ప్రధాని షబా షరీఫ్ మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడని తీవ్రంగా ధ్వజమెత్తాడు. భారత్ జెట్ విమానాలను కూల్చామని ప్రగల్బాలు పలుకుతున్న ప్రధాని వాటిని ఎక్కడ కూల్చాలో శకలాలను కూడా చూపలేకపోతున్నారని పార్లమెంటు సాక్షిగా విమర్శించాడు.
స్కై న్యూస్ యాంకర్ .. మీరు విమానాలు కూల్చినట్టు ఆధారాలు చూపమంటే అది ఇండియా సోషల్ మీడియాలనే వచ్చిందని, అంతకంటే ఆధారాలేం కావాలని అనడం సిగ్గుచేటని గఫార్ ఖాన్ విమర్శించారు. అప్పటికీ యాంకర్ .. నాకు సోషల్ మీడియా కాదు.. మాకు ఆధారాలు చూపగలుగుతావా అంటే ఆయన దగ్గర మాటలు లేవని, ఇటువంటి ప్రధాని నేతృత్వంలో మనం యుద్ధం చేస్తున్నామని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి లాహోర్ జైలు వద్ద మాట్లాడుతూ.. భారత గగన తలం నుంచి పాక్ భూభాగంలో అంతటా డ్రోన్ ల దాడి జరుగుతుందని, ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది. పాకిస్తాన్ లో అత్యంత పటిష్టంగా ఉన్న రాడార్ వ్యవస్థను, వైమానిక దళాన్ని కూడా వినియోగించుకోలేని దీన దయనీయస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు.
ఇంకోవైపు .. తమ భూభాగంలోకి వచ్చి భారత్ మిస్సైళ్లతో వచ్చి అటాక్ చేసి విషయం గురించి అక్కడి పౌరులు సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా చెబుతున్న సత్యాలు పాకిస్తాన్ను సంకటంలో పడవేస్తున్నాయి. సరిహద్దులలో అమాయకుల నివాసాలపై పాకిస్తాన్ కాల్పులు జరిపి తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో చాలా మంది అమాయకులతో పాటు కొంతమంది సైనికులు కూడా బలవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే.. బలుచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న పౌరులు.. పాకిస్తాన్ సైనికులను తరిమి కొడుతున్నారు. ఇప్పటికే క్వైరో పట్టణాన్ని బెలూచ్ ప్రజలు స్వాధీనం పరుచుకున్నారు. తమ జెండాను ఎగరవేశారు.
ఇక, పాక్ అసమర్థతపై ప్రజలలో తిరుగుబాటు మొదలైంది. ప్రస్తుత ప్రభుత్వం మోడీ స్పీడ్ను తట్టుకోలేకపోతున్నదని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మాత్రమే రక్షిస్తాడని పీపుల్స్ పార్టీ ఆందోళన మొదలుపెట్టింది. ఒకరు అల్లా రక్షిస్తారంటే.. చాలా మంది ఇమ్రాన్ ఖాన్ బయటకు రావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. భారత్ ముప్పేటదాడి, బలుచిస్తాన్ అంతర్గత దాడితో సతమతమవుతున్న పాకిస్తాన్కు ఇమ్రాన్ఖాన్ పెద్ద తలనొప్పిగా మారాడు. ప్రస్తుత సంక్షుభిత సమయంలో ఇమ్రాన్ఖాన్ను పెరోల్పై విడుదల చేయాలనే డిమాండ్ పాకిస్తాన్లో పెల్లుబుకుతుంది. ఈ పాకిస్తాన్లో వాదనలు, ప్రతివాదనలు విమర్శలు ఇలా ఉంటే భారతదేశం మాత్రం ఏకధాటిపై పకడ్బందీ వ్యూహంతో యుద్దం చేస్తూ పాకిస్తాన్ను గడగడలాడిస్తున్నది. ప్రాణనష్టం లేకుండా, ఆస్తినష్టం లేకుండా శత్రుదేశాన్ని తుత్తునియలు చేస్తున్నది భారత్. అతిగా అక్కడక్కడా పాకిస్తాన్ జరుపుతున్న దాడులలో కొంత మంది పౌరులు, సైనికులు కూడా అసువులుబాస్తున్నారు. కానీ, పాకిస్తాన్ గతంలో ఎన్నడూ లేనివిధంగా అపార ప్రాణనష్టం, ఆస్తినష్టంతో పాటు ఓ భయకంపికత వాతావరణాన్ని చవిచూస్తున్నది.
ప్రధాని సైతం బంకర్లో దాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.