తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్… ఇవాళ నిజామాబాద్ కోర్టుకు హాజరయ్యాడు .. పాత కేసులో. కొందరు న్యాయవాదులు అతనితో ఫోటోలు దిగారు అభిమానంతో. ఈ ఫోటోలు దిగినవాటిలో ఒకటి మాత్రం వివాదస్పదమైంది. ప్రభుత్వ ప్లీడర్ కోసం జాబితాలో పేరున్న జగదీశ్వర్రావు అనే న్యాయవాది కూడా ఇందులో ఉండటం ఈ వివాదానికి కారణమైంది.
నిత్యం ప్రభుత్వాన్ని, కేసీఆర్ను తూలనాడే నవీన్తో కలిసి ఫోటో దిగాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది… ఆ న్యాయవాది పేరును ప్రభుత్వ ప్లీడర్ కోసం ప్రతిపాదించిన నేపథ్యాన్ని ఇప్పుడు కొందరు న్యాయవాదులు గుర్తు చేస్తూ చర్చించుకుంటున్నారు. దాదాపు 8 మంది పేర్లను జిల్లా జడ్డి సీఎంకు పంపారు ప్రభుత్వ ప్లీడర్ కోసం. ఇది రెండు నెలల్లో ఫైనల్ కానుంది. ఒక్కో నేత ఒకరి పేరును సూచించారు. ఆ పేర్లన్నీ జాబితా రూపంలో సీఎం పేషీకి చేరాయి. ఈ లోపు మల్లన్నతో కలసి ఈ న్యాయవాది ఫోటో దిగడం చర్చకు దారి దీసింది. ఆ న్యాయవాదుల బృందమే దీన్ని బయట పెట్టి వైరల్ చేస్తోంది…