ఇన్ఫెక్షన్ వల్ల ఈటల రాజేందర్కు ఈ రోజు మోకాలి ఆపరేషన్ నిర్వహించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. త్వరలో మళ్లీ పాదయాత్ర ప్రారంభించాలని అనుకున్న ఈటలకు ఈ ఆపరేషన్ బ్రేక్ వేసినట్లయింది. పన్నెండు రోజుల పాటు రోజుకు 25 కి.మీ చొప్పున 222 కి.మీ మేర ఆయన పాదయాత్ర చేశాడు. అస్వస్థత కారణంగా పాదయాత్రకు బ్రేక్ పడింది. తాజాగా మోకాలి ఆపరేషన్తో ఇది మరి కొన్ని రోజుల పాటు జాప్యం జరిగే అవకాశం కనబడుతున్నది. ఒకవేళ వారం తర్వాత పాదయాత్ర ప్రారంభించినా… మొన్న ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే కొనసాగించేలా ప్లాన్ వేస్తున్నారు. అయితే గతంలో మాదిరి కాకుండా పరిమిత ప్రాంతాలను సెలక్ట్ చేసుకొని పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు.