పసుపురైతులు నిండా మునిగారు.. వ్యాపారుల పంట పండింది… 90 శాతం నష్టపోయిన పసుపు రైతులు… ఆరువేలకు క్వింటాలుకు అమ్మేసుకున్నారు… ఇప్పుడు ఎనిమిదివేలు పలుకుతున్న ధర… మహారాష్ట్రలో దిగుబడి లేకపోవడం.. ఇక్కడ ఈ సీజన్కు విస్తీర్ణం తగ్గడంతో చివరలో పెరిగిన రేటు.. కష్టం రైతులది… లాభం వ్యాపారులకు.. ఇదీ జిల్లాలో పసుపురైతుల దుస్థితి…
పసుపు రైతులకు గడ్డుకాలం వచ్చేసింది. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీ పసుపబోర్డు మాట అటకెక్కించడంతో వచ్చినకాడికి అమ్మేసుకుంటున్నారు. స్పైస్ బోర్డు పేరిట రీజరల్ ఆఫీసు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న అర్వింద్… ఆ తర్వాత పసుపుబోర్డు ఊసెత్తలేదు. దీంతో వచ్చిన ధరకు…
