మునుగోడు బై పోల్ అప్డేట్స్
గౌడ‘జన బంధువు’ సీఎం కేసీఆర్ వెంటే తాము అంటూ టీ.ఆర్. ఎస్ లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిదులు, నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాధ్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ను వీడి టీ.ఆర్.ఎస్ లో చేరారు.
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మునుగోడు మండలం కోతులారం సర్పంచ్ , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు జాజుల పారిజాత , సత్యనారయణ గౌడ్ దంపతులు, మునుగోడు మండలం కిష్టాపురం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మానుకుంట్ల కుమార స్వామి గౌడ్, పంతగి లింగస్వామి గౌడ్ , సురుగి లింగ స్వామి గౌడ్, సురిగి రాజు సురిగి వెంకన్న, జాజుల శ్రీశైలం, చండూరు మార్కెట్ వైస్ ఛైర్మెన్, మాజీ జడ్పీటీసీ జాజుల అంజయ్య గౌడ్ ఆధ్వర్యం లో చేరికలు జరిగాయి.
కార్యక్రమం లో చండూరు ఎంపిపి పల్లె కల్యాణి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
